Shruthi Hassan : నా ఫ్రెండ్ దూరమయ్యాడు.. కరోనాతో బీకేర్ ఫుల్ అంటూ శృతి హాసన్ కంటతడి..!
Shruthi hassan : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం పెరుగుతున్ననేపథ్యంలో యాక్టర్ శృతి హాసన్ పలు కీలకవ్యాఖ్యలు చేసింది. కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం వహించరాదని సూచనలు చేసింది. కరోనా వలన ఎన్నో కుటుంబాలు బాధకు గురయ్యారని, అందులో తాను కూడా ఒకదానిని అంటూ ఎమోషనల్ అయ్యింది. దేవుడి దయ వలన తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని కానీ, తన ప్రాణ స్నేహితుడిని కోల్పోవాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది.
విలక్షణ నటుడు కమల్ హాసన్ గతంలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ పొందిన చాలా రోజులకు ఆయన రికవరీ అయ్యారు. శృతి కూడా కొవిడ్ లక్షణాలతో బాధపడింది. కానీ వైద్యుల సలహాలు, సూచనలతో త్వరగా కోలుకుంది. అయితే, కొవిడ్ రియాక్షన్ను దగ్గరి నుంచి చూసిన శృతి ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటంది. ప్రతీ ఒక్కరు కొవిడ్ రూల్స్ పాటించాలని కోరింది. తన తండ్రికి కొవిడ్ బారిన పడిన టైంలో చాలా ఆందోళనకు గురయ్యామని చెప్పిన శృతి.. తన ప్రాణ స్నేహితుడిని కోల్పోయినందుకు ఎంతో బాధపడినట్టు చెప్పుకొచ్చింది.ప్రస్తుతం శృతి తన బాయ్ ఫ్రెండ్తో ముంబైలో లివింగ్ రిలేషన్ షిప్లో ఉంది.

my friend is gone Shruthi Hassan tears saying becarefull with corona
Shruthi hassan : అలా జరుగుతుందని అనుకోలేదు
వరుసగా సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. శృతి హాసన్ కమల్ హాసన్ కూతురిగానే కాకుండా సింగర్, డ్యాన్సర్, యాక్టర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ పేరు సంపాదించుకుంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని కమల్కు కొడుకు లేని లోటును తీర్చింది. అయితే, తన తండ్రి శృతి హాసన్ తల్లిని వదిలేసి వేరే ఆవిడను పెళ్లి చేసుకున్న విషయాన్ని తలుచుకుని ఒక్కోసారి బాధపడుతుందట. అయితే, తను కూడా తన తండ్రి వలే పెళ్లికి ముందే శృలో పాల్గొంటానని గతంలో శృతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.