Kota srinivasarao : జగపతిబాబుతో ఆ మాట అన్న వారానికే నా కొడుకు చనిపోయాడు.. కోట శ్రీనివాసరావు ఎమోషనల్..
Kota srinivasarao : కోట శ్రీనివాసరావు.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరును స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన చాలా మంది ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఇలా డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ సినిమాల్లో కీలకంగా మారారు. ప్రస్తుతం వయస్సు మీద పడటంతో ఆయన నటనకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన తన ఎక్పీరియన్స్, పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
Kota srinivasarao : ఆ సీన్ చూస్తే భయమేసింది

my son died within a week of saying that word to jagapathibabu fort srinivasa rao emotional
సినీ ఇండస్ట్రీలో కొత్త వారు నిలదొక్కుకుని ఎదగాలంటే సీనియర్ల సపోర్ట్ అవసరమని చెప్పారు. అందుకే తన కొడుకును జేడీ చక్రవర్తి, జగపతి బాబు చేతిలో పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన గాయం-2 మూవీలో తన కొడుకు ఆంజనేయప్రసాద్ సైతం యాక్ట్ చేశాడన్నారు. అయితే ఒక రోజు షూటింగ్ టైంలో అక్కడికి కోట వచ్చారట. ఆ రోజు జగపతి బాబు తన కొడుకుని చంపేసే సీన్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం లొకేషన్ లో పాడే సైతం రెడీ చేశారట. ఆ టైంలో తనకు బాధ అనిపించిందని ఇదే విషయాన్ని జగపతిబాబుకు చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.
నా కొడుకును పాడెమీద చూడలేనని, అది తలచుకుంటే భయమేస్తోందని, ఆ సీన్ అవాయిడ్ చేయండని జగపతి బాబుకు చెప్పారట కోట. దీంతో మీ అబ్బాయి ప్లేస్లో డూప్ ను పెడదాం అని చెప్పాడట జగపతిబాబు. ఏ ముహూర్తన ఆ మాట అన్నానోగానీ.. తర్వాత వారం రోజుల్లోనే నా కొడుకు చనిపోయాడని బాగా ఎమోషనల్ అయ్యాడు కోట. ఇక నా కొడుకు శవాన్ని పాడె మీద పడుకోబెడితే ఆ మూవీ సీన్ గుర్తుకు వచ్చిందని, అప్పుడు తనకు భయం వేసిందని చెప్పుకొచ్చాడు. ముందు నా కొడుకు బైక్ పై వెళ్తుండగా.. కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారని.. అంతలోపై అతనికి యాక్స్డెంట్ అయిందని బాధపడ్డాడు.