Nayanthara : ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్గా కొనసాగుతున్న నయనతార తన అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. రీసెంట్గా వివాహం చేసుకున్న విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నయన్ భర్త విఘ్నేశ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీంతో నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వారిలో ఎక్కడో అనుమానం కూడా రేకెత్తింది. ఎందుకంటే తమ అభిమాన నటికి పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలే అవుతోంది. నయనతార తల్లి అయ్యిందని తెలిసి సంతోషించే వారు ఎంత మంది ఉన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా కొత్త చర్చ నడుస్తోంది. నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ను ప్రేమ వివాహం చేసుకుందని అందరికీ తెలుసు.
వీరిద్దరూ దంపతులుగా మారి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. అయితే, అప్పుడే వీరిద్దరూ ఎలా పేరెంట్స్ అయ్యారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది.కానీ ఎవరినీ పిలువకుండా చేసుకున్నారు. వీరి పెళ్లి వీడియోలను నెట్ ఫ్లిక్స్ సంస్థ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంది. అయితే, తమ పెళ్లి దృశ్యాలను కూడా ఓటీటీకి నయన్ దంపతులు అమ్ముకోవడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. మరికొందరు మాత్రం బిజినెస్ ఎలా చేయాలో ఈ దంపతులకు బాగా తెలుసని కామెంట్స్ చేశారు. తాజాగా నయన్ దంపతులు పండంటి కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారని తెలియగానే అంతా షాక్ అవుతున్నారు. నయన్ ఓవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.
గర్భం దాలిస్తే ఇప్పటికే జనాలకు తెలిసేది. కానీ అలాంటిది ఏమీ లేదు. గర్భం కనిపించకుండా ఎవరూ దాచలేరు. నయన్ పెళ్లికి ముందే కమిట్ అయ్యిందని అనుకుంటే అలియా భట్ లాగా రివీల్ చేసి తన బేబీ బంప్ను చూపించేది కదా.. అది కూడా జరగలేదు. మరి ఎలా తల్లి అయ్యిందని అందరికీ అనుమానం రావడంతో అసలు విషయాన్ని తన భర్త తెలిపాడు. తామిద్దరం సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యామని.. పెళ్లికి ముందే దీని గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామని.. దాని ఫలితమే కవలపిల్లలు జన్మించారని పేర్కొనడంతో అంతా షాక్ అవుతున్నారు. గర్భం దాల్చకుండా నయన్ మాతృత్వం ఫీలింగ్ ఎలా పొందుతుందని.. గ్లామర్ దెబ్బతింటుందని ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.