Nayanthara couple gave birth to twins
Nayanthara : ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్గా కొనసాగుతున్న నయనతార తన అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. రీసెంట్గా వివాహం చేసుకున్న విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నయన్ భర్త విఘ్నేశ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీంతో నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వారిలో ఎక్కడో అనుమానం కూడా రేకెత్తింది. ఎందుకంటే తమ అభిమాన నటికి పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలే అవుతోంది. నయనతార తల్లి అయ్యిందని తెలిసి సంతోషించే వారు ఎంత మంది ఉన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా కొత్త చర్చ నడుస్తోంది. నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ను ప్రేమ వివాహం చేసుకుందని అందరికీ తెలుసు.
వీరిద్దరూ దంపతులుగా మారి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. అయితే, అప్పుడే వీరిద్దరూ ఎలా పేరెంట్స్ అయ్యారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది.కానీ ఎవరినీ పిలువకుండా చేసుకున్నారు. వీరి పెళ్లి వీడియోలను నెట్ ఫ్లిక్స్ సంస్థ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంది. అయితే, తమ పెళ్లి దృశ్యాలను కూడా ఓటీటీకి నయన్ దంపతులు అమ్ముకోవడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. మరికొందరు మాత్రం బిజినెస్ ఎలా చేయాలో ఈ దంపతులకు బాగా తెలుసని కామెంట్స్ చేశారు. తాజాగా నయన్ దంపతులు పండంటి కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారని తెలియగానే అంతా షాక్ అవుతున్నారు. నయన్ ఓవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.
Nayanthara couple gave birth to twins
గర్భం దాలిస్తే ఇప్పటికే జనాలకు తెలిసేది. కానీ అలాంటిది ఏమీ లేదు. గర్భం కనిపించకుండా ఎవరూ దాచలేరు. నయన్ పెళ్లికి ముందే కమిట్ అయ్యిందని అనుకుంటే అలియా భట్ లాగా రివీల్ చేసి తన బేబీ బంప్ను చూపించేది కదా.. అది కూడా జరగలేదు. మరి ఎలా తల్లి అయ్యిందని అందరికీ అనుమానం రావడంతో అసలు విషయాన్ని తన భర్త తెలిపాడు. తామిద్దరం సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యామని.. పెళ్లికి ముందే దీని గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామని.. దాని ఫలితమే కవలపిల్లలు జన్మించారని పేర్కొనడంతో అంతా షాక్ అవుతున్నారు. గర్భం దాల్చకుండా నయన్ మాతృత్వం ఫీలింగ్ ఎలా పొందుతుందని.. గ్లామర్ దెబ్బతింటుందని ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.