Rajamouli : రాత్రి పగలు తేడా లేకుండా రాజమౌళి పిచ్చెక్కినట్టు చేసే పని ఇదా ? చాలా పెద్ద మ్యాటర్ బయటపడింది !

Authored By Breaking News | The Telugu News | Updated on : 5 July 2023, 4:00 pm

Rajamouli : బాహుబలి, RRR సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడు రాజమౌళి పేరు మారుమొగుతోంది. ప్రపంచంలో టాప్ మోస్ట్ దర్శకులు సైతం జక్కన్న పనితీరుని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ గా మీడియా ముందు తెలియజేశారు. భారతదేశంలో జక్కన్నతో పనిచేయటానికి ఎలా నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయో “RRR” బ్లాక్ బస్టర్ తర్వాత హాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం క్యూ కడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇదిలా ఉంటే ఏదైనా సినిమా స్టార్ట్ చేస్తే రాజమౌళి పగలు తేడా లేకుండా పనిచేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్ గా వచ్చేవరకు నటీనటులను జక్కన్న పిండేస్తుంటారని అంటారు.

అందువల్లే ఆయన సినిమాలు చిత్రీకరణకు చాలా సంవత్సరాలు పడతాయని చెబుతుంటారు. తాను తీసే ప్రతి షాట్ రాత్రి పగలు తేడా లేకుండా పరిశీలించుకుంటూ ఉంటారంట. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి సిద్ధమవుతూ ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ విజయేంద్ర ప్రసాద్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నాగాని రాత్రి పగలు తేడా లేకుండా రాజమౌళి పిచ్చెక్కినట్టు ఓ విషయంలో మాత్రం వ్యవహరిస్తూ ఉంటారని చాలా పెద్ద మేటర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేమిటో కాదు డబ్బు విషయంలో రాజమౌళి చాలా ఖచ్చితంగా ఉంటారట. ఎందుకంటే ఒకప్పుడు దర్శకుడుగా కాకముందు… డబ్బు ఎంత అవసరమో అనేక కష్టాలు జక్కన్న చూడటం జరిగిందట.

rajamouli precautions in financial transactions are news viral

rajamouli precautions in financial transactions are news viral

అందుకే డబ్బు విషయంలో చాలా కచ్చితంగా ఉంటారట. అంతేకాదు జక్కన్నకి డబ్బుంటే చాలా పిచ్చట. ఈ క్రమంలో భారీ ఎత్తున డబ్బులు వస్తున్నా కానీ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారట. కోట్లు రెమ్యూనరేషన్ వస్తున్న గాని ఖర్చు మాత్రం లక్షల్లో ఉండేలా జాగ్రత్త పడతారట. డబ్బు ఉన్నప్పుడు ఖర్చు చేస్తే ఆ తర్వాత అవసరం అయినప్పుడు.. డబ్బు లేకపోతే అనేక కష్టాలు పడాల్సి ఉంటుందని జీవిత తొలి దినాలలో నేర్పిన పాఠాలు ఇప్పటికీ రాజమౌళికి డబ్బు విషయంలో జాగ్రత్త వహించేలా చేసాయట. దీంతో వచ్చిన డబ్బుని ఎంత ఖర్చయింది అనే లెక్కలు ఎప్పటికప్పుడు..

రోజు పగలు రాత్రినే తేడా లేకుండా లెక్క రాసుకుంటారట. రోజువారి లెక్కలు అదేవిధంగా నెల లెక్కలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాసుకుంటూ బుక్ మైంటైన్ చేస్తుంటారట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp