SP Balasubrahmanyam : ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయిన ఇన్నేళ్ళకి బయటపడిన భయంకర నిజం !

 Authored By sekhar | The Telugu News | Updated on :31 May 2023,1:00 pm

SP Balasubrahmanyam : తెలుగు సంగీత దర్శకులలో లెజెండరీ గాయకుడు, దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకరు. ఆయన 2021లో కరోనా కారణంగా మృతి చెందడం జరిగింది. సంగీత ప్రపంచానికి ఎస్పీ బాలు ఎన్నో సేవలందించారు. ఆయన పాడిన పాటలు ఎన్నో ఇప్పటికీ కూడా ఆల్ టైం హిట్స్ గా నిలిచాయి. ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యంకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మరణించిన సమయంలో దేశం మొత్తం ఎంతో దిగ్భ్రాంతికి గురైంది. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ఇటీవల ఒక భయంకరమైన నిజం బయటపెట్టారు.

The terrible truth that came out after the death of SP Balasubrahmanyam

The terrible truth that came out after the death of SP Balasubrahmanyam

అదేమిటంటే ఒకప్పుడు ఆర్పి పట్నాయక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల అందరికీ ఎన్నో వరుస సూపర్ హిట్లు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. కానీ సడన్ గా సినిమాలు మానేయడం జరిగింది. దానికి కారణం అప్పట్లో ఓ ప్రముఖ నిర్మాత తన మ్యూజిక్ చేయటం వల్ల సినిమాకు నష్టం జరుగుతుందన్న వ్యాఖ్యలు చేశారట. ఆ సమయంలో నుంచి సినిమాలు చేయటం మానేసినట్లు ఇటీవల ఆర్పి పట్నాయక్ తెలిపారు. కానీ ఆ తర్వాత ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు కలిసినా మ్యూజిక్ ఎప్పుడు మొదలు పెడుతున్నావు అని అడిగేవారు.

S. P. Balasubrahmanyam, Indian Singer With Huge Repertory, Dies at 74 - The  New York Times

ఆయన అడిగారని త్వరలో అంటూ సమాధానం చెప్పేవాడిని. అలా బాలు గారికి ఇచ్చిన మాట కోసం ఇటీవల మళ్ళీ “అహింస” సినిమాకి మ్యూజిక్ ఇవ్వటం జరిగిందని ఆర్పి పట్నాయక్ స్పష్టం చేశారు. అయితే ఈ మాట బాలు గారు ఉన్న సమయంలో నిలబెట్టుకోలేకపోయా అన్న బాధ మాత్రం ఉంది. ఆయనకు ఇచ్చిన మాట కోసమే మళ్లీ సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు మళ్ళి వస్తున్నాను. వాస్తవానికి “చిత్రం 2” సినిమా చేద్దామని డైరెక్టర్ తేజని కలవడం జరిగింది. ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్లి “అహింస” ముందుకు వచ్చింది..అని ఆర్పి పట్నాయక్ స్పష్టం చేశారు.

Also read

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి