Upasana : వివాదంలో రామ్ చరణ్ భార్య.. ఆ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెగెటివ్ కామెంట్స్.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Upasana : వివాదంలో రామ్ చరణ్ భార్య.. ఆ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెగెటివ్ కామెంట్స్..

Upasana : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన బిజినెస్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్ నర్‌గా వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చింది. సామాజిక సేవలు, ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాగా, తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఒకటి ఆమెను వివాదంలోకి నెట్టింది.ఇంతకీ ఉపాసన సోషల్ మీడియా వేదికగా పెట్టిన […]

 Authored By mallesh | The Telugu News | Updated on :27 January 2022,7:30 pm

Upasana : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన బిజినెస్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్ నర్‌గా వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చింది. సామాజిక సేవలు, ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాగా, తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఒకటి ఆమెను వివాదంలోకి నెట్టింది.ఇంతకీ ఉపాసన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఏంటంటే.. ఇటీవల ఉపాసన గుడిగోపురంపై దేవుళ్ల ఫొటోలకు బదులు సినీ తారల బొమ్మలతో పెయింట్ వేసిన పిక్‌ను ఒకదానిని నెట్టింట పోస్ట్ చేసింది.

కాగా, అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరలయింది. అయితే, ఈ ఫొటోను చూసిన కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉపాసన వ్యవహరించిందంటూ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి ఫొటోలు పెట్టి తన గౌరవాన్ని తగ్గించుకోకూడదని ఉపాసనకు ఈ సందర్భంగా నెటిజన్లు కొందరు సలహాలిస్తున్నారు. గుడిగోపురంపై నిలబడటమే కాకుండా చెప్పులు ధరించి ఉన్న వాళ్ల పోస్ట్ షేర్ చేయడమేంటి? అలా చేయడం ద్వారా హిందూ దేవుళ్లపైన వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతున్నదని కామెంట్స్ చేస్తున్నారు. అలా ఉపాసన తాజాగా వివాదంలోకి వచ్చింది.

upasana kamineni netizens fire on mega power star ram charan wife

upasana kamineni netizens fire on mega power star ram charan wife

Upasana : హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఉపాసన..!

అయితే, ఇటువంటి కామెంట్స్ వస్తున్నప్పటికీ ఉపాసన మాత్రం ఆ పోస్టును డిలీట్ చేయడకుండా అలానే ఉంచింది. ఈ సోషల్ మీడియా పోస్టు గురించి మెగాస్టార్ చిరంజీవికి కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కాని బహుశా తెలిసి ఉండకపోవచ్చని కొందరు నెటిజన్లు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డారు. హోం ఐసొలేషన్ లో ఉన్నారు చిరు. ఇక రామ్ చరణ్ తేజ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేయబోయే చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫిల్మ్ కోసం చరణ్ వర్కవుట్ చేస్తున్నారని టాక్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది