Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి…? మీకు శ్రీరామరక్ష …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి…? మీకు శ్రీరామరక్ష …?

 Authored By ramu | The Telugu News | Updated on :11 March 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి...? మీకు శ్రీరామరక్ష ...?

Pippali పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి మీకు శ్రీరామరక్ష

Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి…? మీకు శ్రీరామరక్ష …?

Pippali : ఈ పిప్పని భారతీయ పొడవాటి మిరియాలు అని తిప్పలి అని కూడా పిలుస్తారు. ఈ పిప్పని మిరియాల రుచిని కలిగి ఉంటుంది. ఇది పొడవాటి మిరియాలు కలిగి ఉంటుంది. మిరియాలు కంటే కూడా ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఈ పిప్పలు పండుని, ఎండబెట్టి, మసాలా దినుసులుగా వినియోగిస్తారు. ఈ పిప్పలితో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. జలుబు, ఆస్తమా, దగ్గు వంటి సమస్యలకు, శ్వాస కోశ బంధిత వ్యాధులకు కూడా ఈ పిప్పళ్ళు బాగా ఉపయోగపడతాయి. వీటిని తరచూ తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయి..? ఈ పిప్పళ్ల ని ఎలా వినియోగిస్తారు..? వీటివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం…

Pippali : పిప్పళ్ళ పొడి ఎలా తయారు చేస్తారు :

పిప్పళ్ళ పొడి 1గ్రాము, పాత బెల్లం 5గ్రాములు తీసుకొని బాగా కలిపి చిన్న ఉండలు లాగా చేయాలి. వీటిని రోజు పూటకి ఒకటి చొప్పున, మింగాలి. ఇలా చేస్తే, దగ్గు, ఆస్తమా వంటివి రావు. ఈ వ్యాధులకు పిప్పళ్ళు బాగా పనిచేస్తాయి. అసిడిటీ, ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు సమస్యలు పిప్పళ్లతో తగ్గించుకోవచ్చు.1 గ్రాము గ్రామ పిప్పలపొడి కి అర టీ స్పూన్ తేనె కలిపి, రెండు పూటలా భోజనం తర్వాత తీసుకుంటే, కొన్ని అనారోగ్య సమస్యలు రావు.

ఈ పిప్పళ్ళ ఔషధమును, మట్టి పాత్రను తీసుకొని అందులో పిప్పళ్ళను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని, 3 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఒక టీ స్పూను పిప్పళ్ళ పొడికి తేనెను కలిపి, నోట్లో చప్పరించి మింగుతూ ఉండాలి. రోజుకి పొద్దు, మాపు రెండు సార్లు చేయాలి. ఆకలి తగ్గిన వారికి బాగా ఆకలి వేస్తుంది. పిప్పళ్ళు, వసపొడిని సమాన భాగాలలో తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదులో గోరువెచ్చని నీటిని చేర్చి లేదా పాలతో కలిపి రోజుకు రెండు మార్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. 1/2 గ్రామ పిప్పల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి, రోజుకు రెండుసార్లు ఇలా చేశారంటే, వికారం, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.

పిప్పళ్ళ పొడిని రెండు గ్రాముల మోతాదుల్లో తీసుకొని, దీనికి ఒకటి స్పూన్ తేనెను కలిపి రోజు పొద్దున, సాయంకాలం తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారికి, ఇది దివ్య ఔషధం. ఇది తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏ ఆహార పదార్థాలు, ఏవైనా తినకూడదు. అరగంట వరకు ఏమి తీసుకోకూడదు. ఇలా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది.
ఇంకా ఒక గ్లాస్ మజ్జిగలో రెండు గ్రాముల పిప్పళ్ళ పొడిని కలిపి, ప్రతిరోజు పొద్దు, మాపు తీసుకోవాలి. దీనివల్ల మహిళల్లో ప్రసవం అయిన తరువాత వచ్చే పొట్ట సమస్యలు త్వరగా తగ్గుతాయి. ప్రసవమైన మహిళలకు పొట్ట వస్తుంది. పొట్ట తగ్గి సమతులంగా అవుతుంది. అంతేకాదు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది