Gaddi chamanthi : గడ్డి చామంతి గురించి మీకు తెలుసా..? మేధావులనే ఆశ్చర్యపరిచే లాభాలు దీనిలో ఉన్నాయి..!

 Authored By aruna | The Telugu News | Updated on :3 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  గడ్డి చామంతి గురించి మీకు తెలుసా..?

  •  మేధావులనే ఆశ్చర్యపరిచే లాభాలు దీనిలో ఉన్నాయి..!

Gaddi chamanthi : గడ్డి చామంతి పల్లెటూర్లలో పొలాలు గట్ల వెంట మైదాన ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ పెరిగే మొక్క గడ్డి చామంతి ఆశ్చర్యసి అనే పొదుపురుగుడు కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు దీర్ఘ అండకారంలో ప్రస్తుతపు రంప పంచులు కలిగి ఉంటాయి. సంస్కృతంలో జయంతి వేద అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే దీనిని ప్రాంతాలవారీగా వైశాల కర్ని, గడ్డి చామంతి, గాయపాకు రావణాసురుతల ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో మన పూర్వీకులు దీనిని ఎప్పటినుండో వాడుతున్నారు. దీనిలో ఆల్కలాయిడ్లు లేవనాయిడ్లు ఆయిల్ తో పాటు సోడియం, పొటాషియం, కాల్షియం అధికంగా ఉన్నాయి. గడ్డి చామంతి ఆకులకు యాంటీసెప్టిక్ లక్షణం ఉంది. గాయాలైన తెగిన దీని ఆకులు నలిపి రసం తీసి గాయం ఉన్నచోట లేపనంగా పూస్తే రక్తస్రావం ఆగడంతో పాటు అవి త్వరగా నయం అవుతాయి.

దీని ఆకుల రసం ఆయాసం దగ్గు జలుబు వంటి సమస్యలకు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. గడ్డిచామంతా ఆకుల రసం గుంటగలగరాకు రసం నల్లనవ్వుల నూనెలను సరిసమానంగా కలిపి నేను మిగిలే వరకు సన్నని సెగ పైన వేడి చేసి ఆ మిశ్రమాన్ని తలమాడుకు పట్టిస్తుంటే జుట్టురాలే సమస్య తగ్గి కురులు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతాయి. గడ్డి చామంతా ఆకుకు షుగర్ కంట్రోల్ చేసే గుణం ఉంది. ఈ మొక్కలో ఉన్న జోలిలోని రసాయనం కారణంగా మధుమేహం వ్యాధిని నియంత్రించవచ్చని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెళ్లడైంది. దీని ఆకుల రసాన్ని చర్మ వ్యాధులు ఉన్నచోట లేపనంగా పూస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని ఆకులను ఎండబెట్టి పొగ వేస్తే దోమలు పారిపోతాయి…దీని ఆకులను నూరి ముద్దగా చేయాలి. దీన్ని మొలలపై అప్లై చేసే పడుకోవాలి. ఉదయం లేవగానే కడుక్కుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మొలల సమస్య పోతుంది. నడుము నొప్పిని ఈ మొక్క తగ్గిస్తుంది.

అందుకు ఈ మొక్కలో ఉండే ఆంటీ ఇంప్లమెంటరీ లక్షలమే కారణం. ఈ మొక్క మొత్తం భాగం అంటే ఆకులు వేర్లు, కాండం, పువ్వులు మొత్తం సేకరించి శుభ్రంగా కడిగి దంచి మెత్తటి పేస్టులా చేయాలి. దీనికి కొన్ని మెంతులు, పసుపు కలిపి నూరి చివర్లో కొబ్బరి నూనె కలిపి మెత్తటి పేస్టులా చేసి ఈ పేస్ట్ ను నడుముపై పట్టులా వేయాలి. ఇలా చేస్తుంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. కీళ్ల నొప్పుల ప్రదేశంలో ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి పైన కట్టాలి. ఈ విధంగా చేస్తే కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు..

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి