Uppal : బీఆర్ఎస్కు భారీ షాక్ .. కాంగ్రెస్లోకి భారీ చేరికలు
ప్రధానాంశాలు:
Uppal : బీఆర్ఎస్కు భారీ షాక్ .. కాంగ్రెస్లోకి భారీ చేరికలు
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉప్పల్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం స్థానిక రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని, అందువల్లనే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన పెద్దలు రాములు, సత్తయ్య, వెంకటయ్య, బిక్షపతి, సత్యనారాయణ, రఘుపతి రెడ్డి, అలాగే యువ నాయకులు ప్రశాంత్, నరేష్, జాకర్, లింగాచారి, భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్, బొడ్డు రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ చేరికలు భవిష్యత్తులో ఉప్పల్ రాజకీయ దృశ్యాన్ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.