Krishna.. గవర్నర్‌తో ఇండోనేషియా కాన్సుల్ జనరల్ భేటీ..

Authored By praveen T | The Telugu News | Updated on : 4 September 2021, 3:37 pm

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో భేటీ అయ్యారు. శనివారం రాజ్ భవన్‌లో వీరిరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. అగస్ పి.సప్టోనోకు ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌తో అగస్ పి.సప్టోనో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గురించి పలు విషయాలు వివరించారు.

ఏపీ దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌కు చెప్పారు. ఏపీ సర్కారు పెట్టుబడిదారులకు పలు రాయితీలు అందిస్తోందని చెప్పారు. భేటీ అనంతరం గవర్నర్ హరిచందన్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు. ఇకపోతే టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించిన విజేతలను గవర్నర్ హరిచందన్ అభినందించారు. పారాలింపిక్స్‌లో క్రీడాకారులు భారత్ సత్తా చూపించారని కొనియాడారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు.

praveen T

No bio available for this author.

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp