Krishna..బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని మంత్రి హితవు

Authored By praveen T | The Telugu News | Updated on : 6 September 2021, 2:09 pm

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని, వాటని మానుకోవాలని మంత్రి హితవు పలికారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలతోనే రాష్ట్రంలో గణేశ్ చతుర్థి వేడుకలపై డెసిషన్ తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

కమలం పార్టీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలో ఆలయాలను కూల్చిన టీడీపీని ప్రశ్నించేవారని విమర్శించారు. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే రాష్ట్రప్రభుత్వం వినాయక చవితి వేడుకలు, ఉత్సవాలపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మతం ముసుగులో పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కారు కానీ, నేతలు కానీ వినాయక చవితి జరుపుకోవద్దని చెప్పలేదని తెలిపారు.

 

Advertisement

praveen T

No bio available for this author.

  1. "Chennai Love Story Movie Twitter Review Live Updates : చెన్నై లవ్ స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ , లైవ్ అప్‌డేట్స్‌..!"

  2. "IND vs ZIM : 18 బంతుల్లోనే మ్యాచ్ తిప్పేశాడు.. వైభవ్ తుఫాన్‌తో భారత్ ఘన విజయం!"

  3. "AP Central Government : ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్.. NH-42 విస్తరణకు రూ.680 కోట్లు..!"

  4. "Ashok Sharma : టీమిండియాకు మరో స్పీడ్ గన్ దొరికాడా?.. డెబ్యూలోనే 147 KMPHతో అదరగొట్టిన అశోక్ శర్మ"

  5. "AP Government Jobs : ఏపీ నిరుద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్.. 3,168 ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!"

  6. "Jitendra Singh : 24 గంటల్లో 4 సార్లు చర్చలకు పిలిచాం.. విద్యార్థులకు కేంద్రం మరో విజ్ఞప్తి : జితేంద్ర సింగ్"

  7. "Tech Mahindra Employee : టెక్ మహీంద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా.. సిక్ లీవ్ అడిగానని ఉద్యోగం తీసేశారు.. వీడియో వైర‌ల్‌"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి