Junior NTR : అందరూ అనుకుని చేశారు.. మ‌ళ్లీ ఒంట‌రైన జూనియర్ ఎన్టీఆర్..!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on: December 27, 2023, 1:30 pm
  •  Junior NTR : అందరూ అనుకుని చేశారు.. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ని ఒంటరిని చేశారుగా..

  •  మహేష్ బాబు ప్రతి సంవత్సరం కూడా తన ఫ్యామిలీతో క్రిస్టమస్ వేడుకలు అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విదేశాలలో జరుపుకుంటారు

Junior NTR : మహేష్ బాబు ప్రతి సంవత్సరం కూడా తన ఫ్యామిలీతో క్రిస్టమస్ వేడుకలు అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విదేశాలలో జరుపుకుంటారు.. అదేవిధంగా ఇప్పుడు కూడా జరుపుకున్నారు. మహేష్ కుటుంబం. కాకపోతే ఈసారి త్రిబుల్ ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని మహేష్ ఫ్యామిలీతో పాటు చరణ్ కూడా జాయిన్ ఉన్నారు. రామ్ చరణ్, మహేష్ ప్రతి క్రిస్మస్ కి కలుసుకుంటారు. ఈసారి వీరికి తోడుగా ఎన్టీఆర్ కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నారు. ముఖ్యంగా నమృత, ఉపాసన, లక్ష్మి ప్రణతిలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని అభిమానులు మురుపంగా చెప్పుకుంటారు. గుంటూరు కారం సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నారు..

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించింది ఓ విషయం చెక్కర్లు కొడుతోంది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా బాధపడుతున్నారు. వాస్తవానికి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్స్ ఘనంగా జరుపుకుంటారు.. ఈసారి కూడా అలాగే ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఫారన్ టూర్ కి వెళ్లాలని అనుకున్నారు. కానీ చివరికి మాత్రం చరణ్ ప్లాన్ నీ క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే చరణ్ మెగా ఫ్యామిలీ ఇంట్లో చాలా గ్రాండ్ గా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారట. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అలాగే ఓ ఫంక్షన్ లో ఉపాసనతో నమ్రత కూడా పాల్గొనడం ఆశ్చర్యకరంగా ఉంది..

నమ్రత ఉపాసన కలిసి దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఫొటోస్ లో కనపడటం లేదు. అలాగే ఎన్టీఆర్ ఒక్కడే జపాన్ కి తన ఫ్యామిలీతో వెళ్లినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ట్రిప్ లో జూనియర్ ఎన్టీఆర్ తో మహేష్ ఫ్యామిలీ చరణ్ కూడా జాయిన్ అవ్వాలి. కానీ చివరి నిమిషంలో ఈ ప్లాన్ ని క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, చరణ్, ఉపాసన అందరూ కలిసి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఒకే దగ్గర జరుపుకోవడం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే తన కుటుంబంతో జపాన్ కి వెళ్లడం ఇప్పుడు తన అభిమానులు ఎంతో బాధని వ్యక్తం చేస్తున్నారు.. ప్రతిసారి లాగానే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ ని నమ్మించి ముంచేసారంటు ఎన్టీఆర్ అభిమానులు బాధపడిపోతున్నారు.. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది…

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp