Mahesh Babu : మహేష్ బాబు, హీరోయిన్ మధ్య ఎఫైర్ .. నిజామా..?
ప్రధానాంశాలు:
Mahesh Babu : మహేష్ బాబు, హీరోయిన్ మధ్య ఎఫైర్ .. నిజామా..?
Mahesh Babu : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ చాలా సాధారణమైన విషయమే. ముఖ్యంగా బాలీవుడ్లో వీటిని తరచుగా చూస్తుంటాం. టాలీవుడ్లోనూ ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రముఖ నిర్మాత గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహేష్ బాబు, హీరోయిన్ త్రిష మధ్య ఎఫైర్ నడిచిందని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. మహేష్ బాబు త్రిష కోసం ముంబై వెళ్లేవారని, ఆయన భార్య నమ్రత ఈ విషయాన్ని గమనించి దీనిని బయటకు రాకుండా సెటిల్ చేసిందని చెప్పుకొచ్చారు.

Mahesh Babu : మహేష్ బాబు, హీరోయిన్ మధ్య ఎఫైర్ .. నిజామా..?
Mahesh Babu : మహేష్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా..?
మహేష్ బాబు, త్రిష కాంబినేషన్లో రెండు సినిమాలు తెరకెక్కాయి. 2005లో వచ్చిన ‘అతడు’ సూపర్ హిట్ కాగా, 2006లో వచ్చిన ‘సైనికుడు’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. వీరి జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చినప్పటికీ, ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో మహేష్-త్రిష మధ్య ఎఫైర్ నడిచిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై మహేష్ బాబు లేదా త్రిష ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్లకు గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు. మహేష్ కాంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని పలువురు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నిర్మాత గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు మహేష్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి. మహేష్ గురించి అసత్య ప్రచారం చేయడం తగదని, కేవలం ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధించేదని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి వార్తలు నిజమేనా, లేక కేవలం రూమర్సేనా అనేది మహేష్ బాబు లేదా త్రిష స్పందించిన తర్వాతే స్పష్టత వస్తుంది.