Union Budget 2026 : 27 ఏళ్ల తర్వాత ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టడం వెనుక రీజన్ ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Union Budget 2026 : 27 ఏళ్ల తర్వాత ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టడం వెనుక రీజన్ ఏంటి ?

 Authored By sudheer | The Telugu News | Updated on :1 February 2026,11:46 am

ప్రధానాంశాలు:

  •  Union Budget 2026 : 27 ఏళ్ల తర్వాత ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టడం వెనుక రీజన్ ఏంటి ?

Union Budget 2026 :  Nirmala Sitharaman Budget 2026 సాధారణంగా సెలవు దినాల్లో ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలు జరగవు, కానీ 2026 కేంద్ర బడ్జెట్ ఆదివారం నాడే పార్లమెంటు ముందుకు రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సంప్రదాయాల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. అందులో భాగంగా బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి నెలాఖరు నుండి ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) ప్రారంభం నాటికే బడ్జెట్ ప్రక్రియ అంతా పూర్తయి, నిధులు సకాలంలో విడుదల కావాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ నిబంధన ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీ ఏ వారం వచ్చినా ( ఆదివారం అయినా సరే ) బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తప్పనిసరి. అందుకే 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆదివారం బడ్జెట్ సమర్పించే అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.

Union Budget 2026 ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టడం వెనుక రీజన్ ఏంటి

Union Budget 2026 : ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టడం వెనుక రీజన్ ఏంటి ?

Union Budget 2026  : మార్కెట్ వ్యూహం మరియు ఆర్థిక విశ్లేషణ

ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం వెనుక ఉన్న మరో ఆసక్తికరమైన అంశం స్టాక్ మార్కెట్ నియంత్రణ. సాధారణ పని దినాల్లో బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నప్పుడు మార్కెట్లు సెకన్ల వ్యవధిలో భారీగా లాభనష్టాలకు గురవుతుంటాయి. దీనివల్ల చిన్న పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే, ఆదివారం మార్కెట్లు మూసి ఉండటం వల్ల, ఆర్థిక మంత్రి చేసే ప్రతి ప్రతిపాదనను విశ్లేషకులు, ఇన్వెస్టర్లు ప్రశాంతంగా విశ్లేషించుకోవడానికి 24 గంటల సమయం దొరుకుతుంది. సోమవారం మార్కెట్లు ప్రారంభమయ్యే నాటికి ఒక స్పష్టమైన అవగాహనతో ట్రేడింగ్ జరగడానికి ఇది తోడ్పడుతుంది.

Union Budget 2026 : నిర్మలా సీతారామన్ చారిత్రాత్మక రికార్డు

ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా తొమ్మిదవ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. గతంలో మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె అధిగమించడమే కాకుండా, పూర్తి కాలం ఆర్థిక మంత్రిగా అత్యధిక సార్లు బడ్జెట్ సమర్పించిన మహిళగా నిలిచారు. పాత సంప్రదాయాలను పక్కన పెట్టి ‘బ్రీఫ్ కేస్’ బదులు డిజిటల్ ట్యాబ్ వాడటం, ఇప్పుడు సెలవు రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి చర్యలతో ఆమె తనదైన ముద్ర వేశారు. మరి ఈ బడ్జెట్ లో సామాన్య ప్రజలకు ఎంత మేర లాభం చేకూరుతుందో..? ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో..? పెరుగుతాయో..? చూడాలి.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది