Crime News : 16 ఏళ్ల స్టూడెంట్ తో లేచి పోయిన 22 ఏళ్ల టీచరమ్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 21 January 2023, 8:30 am

Crime News : గురువును మించిన దైవం ఉన్నదా అని ఒకప్పుడు అనుకున్నాం కానీ.. ఇప్పుడు గురువులు అలా లేరు. అలా అని అందరు గురువులు అలా ఉంటారని కాదు.. కొందరు గురువులు చేసే పనుల వల్ల మొత్తం గురువుల వ్యవస్థకే దెబ్బ పడుతోంది. పాఠాలు చెప్పాల్సిన గురువులే స్టూడెంట్స్ తో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, ప్రేమ వ్యవహారాలు నడిపించడం చేస్తూ గురువుల వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

యూపీలోని నోయిడా సెక్టార్ 123కి చెందిన 22 ఏళ్ల వయసు ఉన్న ఓ యువతి.. పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ ఉంటుంది. తన ఇంటి దగ్గరే ట్యూషన్స్ చెబుతుంది. తన ఇంటి దగ్గరే ఉంటే ఓ బాలుడు(16) ఆమె దగ్గర ట్యూషన్ కు వెళ్తుండేవాడు. ట్యూషన్ కు వెళ్లిన సమయంలో కూడా ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటూ ఉండేవారు.

Crime News : ప్రేమగా మారిన వీళ్ల పరిచయం

అయితే.. వీళ్ల ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. యువతి వయసు ఎక్కువ కావడంతో ఇంట్లో వాళ్ల పెళ్లికి ఒప్పుకోరేమో అని భయపడ్డారు. చివరకు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించారు. దీంతో ఇద్దరూ సరిగ్గా ప్లాన్ చేసుకున్నారు. బంధువుల ఇంటికి వెళ్తున్నా అని ఆ యువకుడు చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత యువతి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. ఇద్దరూ ఒక చోట కలుసుకొని.. అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రం అయినా ఇంటికి ఇద్దరూ తిరిగి రాకపోవడంతో ఇరు ఇండ్లలో అనుమానం వచ్చింది. యువతి మీద డౌట్ వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాలుడి తండ్రి. యువతే మాయ మాటలు చెప్పి తన కొడుకును లేపుకెళ్లిందని ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp