LPG Cylinders : బ్రేకింగ్‌.. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. సిలిండర్ల సరఫరాపై మోదీ సర్కార్ కీలక ప్రకటన ..!

 Authored By sudheer | The Telugu News | Updated on :19 March 2026,5:40 pm

ప్రధానాంశాలు:

  •  LPG Cylinders : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. సిలిండర్ల సరఫరాపై మోదీ సర్కార్ కీలక ప్రకటన ..!

LPG Cylinders : వంటగ్యాస్ సిలిండర్ కోసం వేచి చూసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. ఇటీవల నెలకొన్న గ్యాస్ కొరతపై వచ్చిన వదంతులను ఖండిస్తూ, దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. ఇకపై సిలిండర్ అందక ఆలస్యం అవుతుందనే భయం అవసరం లేదని అధికారులు తెలిపారు.

LPG Cylinders : బ్రేకింగ్‌.. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. సిలిండర్ల సరఫరాపై మోదీ సర్కార్ కీలక ప్రకటన ..!

LPG Cylinders : బ్రేకింగ్‌.. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. సిలిండర్ల సరఫరాపై మోదీ సర్కార్ కీలక ప్రకటన ..!

LPG Cylinders : గ్యాస్ కొరతపై స్పష్టత .. అదనపు కేటాయింపులు

కేంద్ర పెట్రోలియం శాఖ తాజా సమాచారం ప్రకారం దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని వెల్లడించింది. ముఖ్యంగా వాణిజ్య వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా 10 శాతం కమర్షియల్ ఎల్‌పీజీ కేటాయించాలని నిర్ణయించింది. ఈ చర్యతో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి రంగాలకు పెద్ద ఉపశమనం లభించనుంది. అయితే, భవిష్యత్తులో పైప్‌లైన్ గ్యాస్ (PNG) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు సహకరించాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే పలురాష్ట్రాలు ఈ దిశగా చర్యలు ప్రారంభించాయి. దీంతో గ్యాస్ పంపిణీ వ్యవస్థ మరింత సులభతరం కానుంది.

LPG Cylinders : ఉత్పత్తి, సరఫరాలో పెరుగుదల .. ప్రజలకు భరోసా

గత కొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా జరగడం గమనార్హం. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి 40 శాతం పెరగడం, విదేశాల నుంచి ముడిచమురు దిగుమతులు సాధారణంగా కొనసాగడం వల్ల నిల్వలపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. అలాగే ఎల్‌ఎన్‌జీ (LNG), సీఎన్‌జీ (CNG), పీఎన్‌జీ (PNG) వంటి ఇంధనాల సరఫరా కూడా అంతరాయం లేకుండా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు లేకపోవడం వాహనదారులకు మరింత ఊరటనిస్తోంది. రిఫైనరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నందున ఇంధన భద్రత బలంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.

LPG Cylinders : ఆన్‌లైన్ సేవలతో సులభతరం .. అక్రమాలపై కఠిన చర్యలు

గ్యాస్ బుకింగ్ విధానంలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం తగ్గింది. సిలిండర్లు నేరుగా ఇంటికే చేరే విధానం వేగవంతమైంది. ఇక పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అక్రమాలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వినియోగదారులకు సమయానికి గ్యాస్ అందేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులు వదంతులను నమ్మకుండా, అవసరానికి అనుగుణంగా సిలిండర్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు.

 

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి