
step mother murders son by giving poison in tea
Crime News : సొంత కొడుకును ఎవరైనా చంపుతారా? సొంతం అయినా కాకున్నా ఒక వ్యక్తిని చంపడం అనేది తప్పు. ఓ మహిళ తన సవితి కొడుకును అమానవీయంగా చంపేసింది. 8 ఏళ్ల తన సవతి కొడుకుకు టీలో విషం కలిపి ఇచ్చి చంపేసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. అసలు ఆ బాలుడిని చంపాల్సిన అవసరం ఆ మహిళకు ఎందుకు వచ్చిందో తెలుసుందాం రండి.
step mother murders son by giving poison in tea
నితిన్ అనే 8 ఏళ్ల బాలుడి తల్లి సీమ రెండేళ్ల కింద రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో సీమ కొడుకుకు ఆమె ఇన్సురెన్స్ డబ్బులు రూ.12 లక్షలు వచ్చాయి. దీంతో ఆ డబ్బులను ఆ బాలుడి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఆ తర్వాత బాలుడి తండ్రి రాజు.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. బాలుడి పేరు మీద రూ.12 లక్షల డబ్బు డిపాజిట్ అయి ఉందని తెలుసుకున్న ఆ మహిళ.. ఆ బాలుడిని వేధించడం మొదలు పెట్టింది.
ఆ డబ్బులు దక్కించుకోవాలని.. దాని కోసం నితిన్ ను చంపాలని ప్లాన్ వేసింది. అందుకోసం.. నితిన్ కు టీ ఇచ్చి అందులో విషం కలిపింది. అది తాగగానే నితిన్ ఆరోగ్యం చెడిపోయింది. దీంతో వెంటనే అతడి తండ్రి కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దాదాపు మూడు రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత నితిన్ మృతి చెందాడు. అయితే.. కొడుకు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు రాజు రెండో భార్యపై అనుమానంతో ఆరా తీయగా మొత్తం విషయం అంతా బయటపడింది. తానే హత్య చేశా అని ఒప్పుకోవడంతో ఆమె దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు జీవిత ఖైదును విధించింది.
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.