Crime News : ఆన్ లైన్ లో బాలికకు పరిచయం అయ్యాడు.. తన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :23 December 2022,8:30 am

Crime News : స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ.. ఒక్కోసారి ఆ స్మార్ట్ ఫోన్ వల్ల చాలా నష్టాలు కూడా ఉంటాయి అని ఇటువంటి ఘటనల గురించి తెలిసినప్పుడు అర్థం అవుతుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. 10 వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికకు తన తండ్రి కరోనా సమయంలో స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఆన్ లైన్ క్లాసెస్ కోసం ఆ బాలిక ఆ ఫోన్ ను వాడేది. అయితే.. ఖాళీ సమయంలో ఆ ఫోన్ లో రకరకాల గేమ్స్ ఆడేది. అందులో ఓ గేమ్ ఆడుతూ ఒక యువకుడికి పరిచయం అయింది. ఇద్దరూ రోజూ గేమ్స్ ఆడుతూ తమ గురించి మాట్లాడుకునేవారు.

young boy misused girl photos online in madhyapradesh

young boy misused girl photos online in madhyapradesh

ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది. దీంతో కొన్నాళ్లకు ఆ బాలికకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి ఐడీలను తీసుకొని వాటి నుంచి తన పర్సనల్ ఫోటోలను, వీడియోలను సేకరించి.. వాటిని ఎడిట్ చేసి అసభ్యకరంగా మార్చాడు. వాటిని ఆ బాలిక వాట్సప్ కు పంపించాడు. తనను బెదిరించారు. ఈ విషయాన్ని వెంటనే బాలిక తన తండ్రికి తెలిపింది. దీంతో అప్పటి నుంచి ఆ బాలిక తండ్రిని బెదిరించడం మొదలు పెట్టాడు ఆ యువకుడు.

Crime News : నీ కూతురును నా వద్దకు పంపు అంటూ బెదిరించిన ప్రబుద్ధుడు

నీ కూతురును నా వద్దకు పంపు. లేదంటే నీ కూతురు ఫోటోలు, వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ బెదిరించాడు ఆ యువకుడు. ఆ బాలిక తండ్రి దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలిక ఫోటోలను, వీడియోలను ఆ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశాడు. దీంతో బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి