
ap cm ys jagan laid foundation stone for bhogapuram airport
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. సంవత్సరం పైనే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం అంటే 175 సీట్లు గెలుచుకోవాలని ఆరాటపడుతున్న సీఎం జగన్ కు ఎన్నికల వేళ గుడ్ న్యూస్ అందింది. మరో గెలుపు దక్కింది. అసలు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనే ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో మంచి సమాధానం దొరికింది జగన్ కు.
మరోసారి అమరావతి కేంద్రంగా రాష్ట్ర మద్దతుదారుడిగా ఉన్న నాయకుడినే ఉద్యోగులు గెలిపించారు. ఏపీ సచివాలయం సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డిని ఎన్నుకున్నారు. వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి ఏపీ ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. అసలే ఉద్యోగులు ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు అనే వార్తలు వినవొస్తున్న ఈనేపథ్యంలో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఏపీ ప్రభుత్వం కాస్త టెన్షన్ పడిన మాట వాస్తవమే. కానీ.. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వెంకట్రామిరెడ్డినే గెలిపించి వైసీపీ పార్టీకి మళ్లీ ఊపిరి పోసినంత పని చేశారు. ఏపీ సచివాలయ సంఘం(అప్సా) అధ్యక్షుడిగా రెండోసారి వెంకట్రామిరెడ్డి కొనసాగనున్నారు.
another win for ap cm ys jagan in amaravathi
మొత్తం సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ లో ఉన్న 1225 మంది ఉద్యోగుల్లో.. 1162 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో.. వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా.. రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకట్రామిరెడ్డి 228 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజానికి ఇది కేవలం సచివాలయానికి సంబంధించిన ఎన్నికే అయినా.. ఇది వచ్చే ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సచివాలయం ఉద్యోగుల మూడ్ ను ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. చూద్దాం మరి ఈ ఎన్నికల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా పడుతుందో?
YS Jagan : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. గత…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో ఆయన…
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది పండుగ ఒక పెద్ద మార్పుకు వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజకీయ…
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.…
LPG Crisis : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత్లో కూడా…
Viral news : మహాకుంభ్ మేళాలో తీయించుకున్న ఫొటోలతో ఒక్క రాత్రిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా గుర్తింపు…
Hyderabad : హైదరాబాద్లోని వృత్తిదారుల భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో…
Gold and Silver Rate Today on March 12 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు,…
Karthika Deepam 2 March 12th 2026 Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న 'కార్తీక దీపం 2' సీరియల్…
Guava Vs Banana : మన శరీరానికి పండ్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. ముఖ్యంగా రాత్రంతా ఆహారం తీసుకోకుండా…
This website uses cookies.