ap cm ys jagan laid foundation stone for bhogapuram airport
YS Jagan : హమ్మయ్య.. ఇన్నాళ్లకు ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరబోతోంది. ఉత్తరాంధ్ర వాసులు కలకన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మే 3న శంకుస్థాపన జరగనుంది. దానికి సంబంధించి సీఎం జగన్ వైజాగ్ పర్యటన కూడా ఖరారైంది. మే 3న ఉదయం 9.20 కి వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు విజయవాడ నుంచి బయలుదేరుతారు జగన్. అక్కడి నుంచి భోగాపురం మండలంలోని ఎ.రావివలసకు హెలికాప్టర్ లో వెళ్తారు. అనంతరం సీఎం జగన్.. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
ap cm ys jagan laid foundation stone for bhogapuram airport
బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన తర్వాత సీఎం జగన్.. రూ.194 కోట్లతో నిర్మించబోయే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులకు, చింతపల్లి జెట్టీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ లో బయలుదేరి.. వైజాగ్ కు చేరుకుంటారు. అక్కడ వైజాగ్ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి ఎంపీ ఎంవీవీ ఇంటికి వెళ్తారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లిన తర్వాత ఎంపీ కుమారుడిని ఆశీర్వదిస్తారు. ఇటీవలే ఎంపీ కుమారుడి పెళ్లి జరిగింది. దీంతో కొత్త దంపతులను ఆశీర్వదించి.. అక్కడే కొంత సేపు పార్టీ నేతలతో మాట్లాడనున్నారు సీఎం జగన్. అనంతరం..
Ysrcp
అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు. ఇక.. భోగాపురం విమానాశ్రయాన్ని సుమారు 2200 ఎకరాల్లో నిర్మించనున్నారు. జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ను రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. భోగాపురంలో భూమిని సేకరించి.. భూనిర్వాసితులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చనుంది. 2025 నాటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు లాండ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే.. వైజాగ్ లో అదానీ కంపెనీ పెట్టబోయే డేటా సెంటర్, ఐటీ పార్క్ ను సుమారు రూ.21 వేల కోట్లతో నిర్మిస్తున్నారు. దానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.