Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

 Authored By sandeep | The Telugu News | Updated on :9 September 2025,2:00 pm

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో, రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

#image_title

అల్పపీడనం ప్రభావంతో

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుంచి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి