
can we drink water after eating fruits
Fruits : వేసవి కాలంలో ఎక్కువగా పండ్లను తింటుంటారు. దానికి కారణం.. తీవ్ర వేడిని తట్టుకోవడం కోసం.. డీహైడ్రేషన్ ను తట్టుకోవడం కోసం అలా చేస్తాం. అవి శరీరానికి కావాల్సిన ఫైబర్ ను, విటమిన్లను అందించడమే కాకుండా.. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అయితే.. చాలామంది పండ్లు తినగానే.. నీళ్లు తాగుతారు. కొందరు పండ్లు తినేముందు ఫుల్లుగా నీళ్లు తాగుతారు. అసలు.. పండ్లు తిన్నాక నీళ్లు తాగాలా? వద్దా? నీళ్లు ఎప్పుడు తాగాలి? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.మనం పైన చెప్పుకున్నట్టు.. పండ్లలో హైడ్రేటింగ్ శక్తి విపరీతంగా ఉంటుంది. మీకు చాలా దాహం వేసినప్పుడు పండ్లు తిన్నా కూడా దాహం తీరుతుంది. మళ్లీ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పుచ్చకాయను తిన్నారనుకోండి. మీకు అస్సలు దాహమే వేయదు ఇక.
can we drink water after eating fruits
పండ్లు తిన్నాక దాహం తీరాక కూడా మళ్లీ నీళ్లు తాగితే శరీరంలో లేనిపోని సమస్యలు వస్తాయట. కోరి సమస్యలను తెచ్చుకున్నట్టేనట. ఒకవేళ పండ్లు తిన్నాక కూడా విపరీతంగా దాహం వేస్తే.. కనీసం 30 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దాహం తీర్చుకోవాలి. దాహం వేయకపోతే.. కనీసం ఓ గంట సేపు ఆగి నీళ్లు తాగాలట.
పండ్లు తినగానే నీళ్లు ఎందుకు తాగకూడదు అంటే.. పండ్లు తినగానే అవి డైరెక్ట్ గా జీర్ణాశయంలోకి వెళ్తాయి. అక్కడ జీర్ణ ప్రక్రియ కోసం.. తిన్న పండ్లను అరిగించడం కోసం జీర్ణ వ్యవస్థ కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఆ ఆమ్లాలు.. వెంటనే తిన్న పండ్లను జీర్ణం చేస్తాయి. ఒకవేళ మీరు పండ్లు తినగానే.. నీళ్లు తాగితే.. ఆ నీళ్లు.. విడుదలైన జీర్ణ ఎంజైమ్ లను పలుచన చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. తిన్న పండ్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దాన్ని జీర్ణం చేయడానికి.. జీర్ణ వ్యవస్థ ఎక్కువ సేపు కష్టపడాల్సి వస్తుంది. దాని వల్ల.. గ్యాస్ రావడం, కడుపులో మంట రావడం.. ఇతర సమస్యలు వస్తాయి.
can we drink water after eating fruits
పండ్లు తినగానే నీటిని తాగితే.. అతిసారం వస్తుందట. పండ్లలో ఎక్కువ నీరు ఉండటం, నీరు తాగగానే మరోసారి శరీరంలో నీటి కంటెంట్ ఎక్కువవుతుంది. దాని వల్ల.. పేగుల కదలికలు సులభతరం అయి.. అతిసారానికి దారి తీస్తుంది. అలాగే.. శరీరంలోని పీహెచ్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. పీహెచ్ స్థాయి ఆమ్లతను సూచిస్తుంది. పండ్లు తినగానే నీరు తాగితే.. పీహెచ్ స్థాయిలు కూడా పలుచన అవుతాయి. దాని వల్ల కూడా జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వస్తుంది. అందుకే.. పండ్లు తినగానే అస్సలు నీళ్లు తాగకూడదు.
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్ను తీసుకురానుంది.…
This website uses cookies.