
central Govt create new problems between ap telangana
Ap – Telangana : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. వాటిని అలా ఉంచి కొత్త పేచీ పెట్టడానికి మోడీ సర్కారు రెడీ అవుతోందా?, దానికి తెలంగాణ రాష్ట్రం తొందరపడి తలూపిందా? అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీని తీర్చటానికి ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించటానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఎనిమిది నెలల కిందట ఒక ప్రతిపాదన చేశారు. ఈ గొడవకు సంబంధించి తెలంగాణ సర్కారు గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకోవాలని సూచించారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఈ ప్రపోజల్ పెట్టారు. దానికి రాష్ట్ర కృష్ణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచీ సానుకూలంగానే ఉన్నారు. కానీ ఈ ఇష్యూలో తెలంగాణ కొంత వెనకడుగు వేసిందని కొందరు అంటున్నారు.
central Govt create new problems between ap telangana
తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని తొలగించటంలో ఆటంకంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకపోతే మళ్లీ న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు మెట్టు దిగిందని ఎలా అనగలం?. కాకపోతే ఈ వంకతో సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ, తెలంగాణ నిర్మిస్తున్న అన్ని సాగు, తాగు నీటి ప్రాజెక్టుల వివరాలను తన దగ్గరికి తెప్పించుకుందని, వాటిని అడ్డం పెట్టుకొని ఫ్యూచర్ లో ఇరు రాష్ట్రాల మధ్య పొలిటికల్ పంచాయతీ పెట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Modi
గతంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ పరిష్కరించలేదని, ట్రిబ్యునళ్ల ద్వారానే ఒక కొలిక్కి వచ్చేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడైనా కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తారా? లేక కేంద్ర మంత్రే చిక్కుముడిని విప్పుతారా అనేది చూడాలి. గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కృష్ణా ఇష్యూని వాడుకుంటుందా అనే డౌటు కూడా కొంత మందికి వస్తోంది. ఏదేమైనప్పటికీ మోడీ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో గమనించకుండానే తొందరపడి ఒక అంచనాకు రావటం సరికాదనిపిస్తోంది. ఏదో ఒక విధంగా ప్రతిష్టంభన వీడితే దక్షిణ తెలంగాణకు సాగునీటి విషయంలో తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు తాపత్రయపడుతోంది.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
This website uses cookies.