central Govt create new problems between ap telangana
Ap – Telangana : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. వాటిని అలా ఉంచి కొత్త పేచీ పెట్టడానికి మోడీ సర్కారు రెడీ అవుతోందా?, దానికి తెలంగాణ రాష్ట్రం తొందరపడి తలూపిందా? అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీని తీర్చటానికి ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించటానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఎనిమిది నెలల కిందట ఒక ప్రతిపాదన చేశారు. ఈ గొడవకు సంబంధించి తెలంగాణ సర్కారు గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకోవాలని సూచించారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఈ ప్రపోజల్ పెట్టారు. దానికి రాష్ట్ర కృష్ణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచీ సానుకూలంగానే ఉన్నారు. కానీ ఈ ఇష్యూలో తెలంగాణ కొంత వెనకడుగు వేసిందని కొందరు అంటున్నారు.
central Govt create new problems between ap telangana
తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని తొలగించటంలో ఆటంకంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకపోతే మళ్లీ న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు మెట్టు దిగిందని ఎలా అనగలం?. కాకపోతే ఈ వంకతో సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ, తెలంగాణ నిర్మిస్తున్న అన్ని సాగు, తాగు నీటి ప్రాజెక్టుల వివరాలను తన దగ్గరికి తెప్పించుకుందని, వాటిని అడ్డం పెట్టుకొని ఫ్యూచర్ లో ఇరు రాష్ట్రాల మధ్య పొలిటికల్ పంచాయతీ పెట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Modi
గతంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ పరిష్కరించలేదని, ట్రిబ్యునళ్ల ద్వారానే ఒక కొలిక్కి వచ్చేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడైనా కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తారా? లేక కేంద్ర మంత్రే చిక్కుముడిని విప్పుతారా అనేది చూడాలి. గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కృష్ణా ఇష్యూని వాడుకుంటుందా అనే డౌటు కూడా కొంత మందికి వస్తోంది. ఏదేమైనప్పటికీ మోడీ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో గమనించకుండానే తొందరపడి ఒక అంచనాకు రావటం సరికాదనిపిస్తోంది. ఏదో ఒక విధంగా ప్రతిష్టంభన వీడితే దక్షిణ తెలంగాణకు సాగునీటి విషయంలో తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు తాపత్రయపడుతోంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.