
central Govt create new problems between ap telangana
Ap – Telangana : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. వాటిని అలా ఉంచి కొత్త పేచీ పెట్టడానికి మోడీ సర్కారు రెడీ అవుతోందా?, దానికి తెలంగాణ రాష్ట్రం తొందరపడి తలూపిందా? అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీని తీర్చటానికి ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించటానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఎనిమిది నెలల కిందట ఒక ప్రతిపాదన చేశారు. ఈ గొడవకు సంబంధించి తెలంగాణ సర్కారు గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ఉపసంహరించుకోవాలని సూచించారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఈ ప్రపోజల్ పెట్టారు. దానికి రాష్ట్ర కృష్ణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచీ సానుకూలంగానే ఉన్నారు. కానీ ఈ ఇష్యూలో తెలంగాణ కొంత వెనకడుగు వేసిందని కొందరు అంటున్నారు.
central Govt create new problems between ap telangana
తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని తొలగించటంలో ఆటంకంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకపోతే మళ్లీ న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు మెట్టు దిగిందని ఎలా అనగలం?. కాకపోతే ఈ వంకతో సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ, తెలంగాణ నిర్మిస్తున్న అన్ని సాగు, తాగు నీటి ప్రాజెక్టుల వివరాలను తన దగ్గరికి తెప్పించుకుందని, వాటిని అడ్డం పెట్టుకొని ఫ్యూచర్ లో ఇరు రాష్ట్రాల మధ్య పొలిటికల్ పంచాయతీ పెట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Modi
గతంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ పరిష్కరించలేదని, ట్రిబ్యునళ్ల ద్వారానే ఒక కొలిక్కి వచ్చేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడైనా కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తారా? లేక కేంద్ర మంత్రే చిక్కుముడిని విప్పుతారా అనేది చూడాలి. గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కృష్ణా ఇష్యూని వాడుకుంటుందా అనే డౌటు కూడా కొంత మందికి వస్తోంది. ఏదేమైనప్పటికీ మోడీ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో గమనించకుండానే తొందరపడి ఒక అంచనాకు రావటం సరికాదనిపిస్తోంది. ఏదో ఒక విధంగా ప్రతిష్టంభన వీడితే దక్షిణ తెలంగాణకు సాగునీటి విషయంలో తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు తాపత్రయపడుతోంది.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.