
ys jagan by election in Ap
Ys Jagan : ఇటీవలే తిరుపతి ఉపఎన్నిక, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరో సారి బై ఎలక్షన్ కి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరిన నలుగురు శాసన సభ్యుల చేత రాజీనామా చేయించటంతోపాటు విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాని స్పీకర్ చేత ఆమోదింపజేయించటం ద్వారా మినీ సమరానికి సై అంటున్నట్లు అనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీని దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయమని, దాన్ని మళ్లీ లేవకుండా చేయాలనేది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతానంటే కరోనా నేపథ్యంలో వైఎస్సార్సీపీ వద్దు అని చెప్పింది. అయినా అవి జరిగిపోయాయి. మొత్తానికి అవి అధికార పార్టీకి మంచే చేశాయి. ప్రజల్లో తమ బలమేంటో తెలిసొచ్చేలా చేశాయి. పైకి కొవిడ్ అని చెప్పినా లోపల మాత్రం ఎలక్షన్లంటే రూలింగ్ పార్టీ తటపటాయించినట్లు అపొజిషన్ పార్టీ విమర్శించింది. ఎద్దేవా చేసింది. చివరికి నవ్విన నాప చేనే పండింది. దీంతో వైఎస్సార్సీపీలో మునుపటి కన్నా మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికలంటే చాలు రెడీ అంటోంది. టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్నారనే అపవాదును చెరిపేయించుకోవటానికి బై ఎలక్షనే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయింది.
ys jagan by election in Ap
వల్లభనేని వంశీ(విజయవాడ), మద్దల గిరి(గుంటూరు), కరణం బలరాం(ప్రకాశం), వాసుపల్లి గణేష్ కుమార్(విశాఖ సౌత్) తమ పార్టీ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ తరఫునకు వచ్చేశారు. వీరికి తోడు కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కొవిడ్ తో చనిపోయారు. అక్కడ కూడా ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామరాజు రెబల్ గా మారటంతో అతనిపై లోక్ సభ స్పీకర్ చేత అనర్హత వేటు వేయించటం ద్వారా అక్కడ కూడా బైఎలక్షన్ పెట్టాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ ఆరు చోట్ల ఉప ఎన్నికలు వస్తే వైఎసార్సీపీకి ఎన్నో విధాలుగా లాభం కలుగుతుంది. ముఖ్యంగా టీడీపీ చేస్తున్న పనికి మాలిన విమర్శలకు మరోసారి చెక్ పెట్టొచ్చు. రాష్ట్ర రాజకీయాలపై తన పట్టును మరింత నిలబెట్టుకోవచ్చు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.