Ys Jagan : ఇటీవలే తిరుపతి ఉపఎన్నిక, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరో సారి బై ఎలక్షన్ కి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరిన నలుగురు శాసన సభ్యుల చేత రాజీనామా చేయించటంతోపాటు విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాని స్పీకర్ చేత ఆమోదింపజేయించటం ద్వారా మినీ సమరానికి సై అంటున్నట్లు అనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీని దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయమని, దాన్ని మళ్లీ లేవకుండా చేయాలనేది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతానంటే కరోనా నేపథ్యంలో వైఎస్సార్సీపీ వద్దు అని చెప్పింది. అయినా అవి జరిగిపోయాయి. మొత్తానికి అవి అధికార పార్టీకి మంచే చేశాయి. ప్రజల్లో తమ బలమేంటో తెలిసొచ్చేలా చేశాయి. పైకి కొవిడ్ అని చెప్పినా లోపల మాత్రం ఎలక్షన్లంటే రూలింగ్ పార్టీ తటపటాయించినట్లు అపొజిషన్ పార్టీ విమర్శించింది. ఎద్దేవా చేసింది. చివరికి నవ్విన నాప చేనే పండింది. దీంతో వైఎస్సార్సీపీలో మునుపటి కన్నా మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికలంటే చాలు రెడీ అంటోంది. టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్నారనే అపవాదును చెరిపేయించుకోవటానికి బై ఎలక్షనే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయింది.
వల్లభనేని వంశీ(విజయవాడ), మద్దల గిరి(గుంటూరు), కరణం బలరాం(ప్రకాశం), వాసుపల్లి గణేష్ కుమార్(విశాఖ సౌత్) తమ పార్టీ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ తరఫునకు వచ్చేశారు. వీరికి తోడు కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కొవిడ్ తో చనిపోయారు. అక్కడ కూడా ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామరాజు రెబల్ గా మారటంతో అతనిపై లోక్ సభ స్పీకర్ చేత అనర్హత వేటు వేయించటం ద్వారా అక్కడ కూడా బైఎలక్షన్ పెట్టాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ ఆరు చోట్ల ఉప ఎన్నికలు వస్తే వైఎసార్సీపీకి ఎన్నో విధాలుగా లాభం కలుగుతుంది. ముఖ్యంగా టీడీపీ చేస్తున్న పనికి మాలిన విమర్శలకు మరోసారి చెక్ పెట్టొచ్చు. రాష్ట్ర రాజకీయాలపై తన పట్టును మరింత నిలబెట్టుకోవచ్చు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.