Munugodu Bypoll : మునుగోడు టికెట్ ను కన్ఫమ్ చేసిన కేసీఆర్.. ఎవరికి ఇచ్చారో తెలుసా?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 15 August 2022, 8:00 pm

Munugodu Bypoll : నేను మోనార్క్ ను నన్నెవరూ మోసం చేయలేరు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడప్పుడు ప్రవర్తిస్తుంటారు. తాజాగా మునుగోడు విషయంలోనూ అదే జరిగింది అని తెలుస్తోంది. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో మునుగోడులో ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇంకో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కానీ.. ఆ ఎన్నికల కంటే ముందు మునుగోడు ఉపఎన్నిక రావడంతో తెలంగాణ రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.

మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ మరోసారి తాను మోనార్క్ ను అని నిరూపించుకున్నారు. ఎందుకంటే.. మునుగోడు ఉపఎన్నిక కోసం ఈసారి కేసీఆర్ టికెట్ ఎవరికి ఇస్తారు అందరూ టెన్షన్ పడుతున్న వేళ.. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది.

cm kcr to give Munugodu Bypoll ticket to kusukuntla prabhakar reddy

cm kcr to give Munugodu Bypoll ticket to kusukuntla prabhakar reddy

Munugodu Bypoll : కూసుకుంట్లకు టికెట్ ఇస్తే మేమే ఓడిస్తామన్న టీఆర్ఎస్ శ్రేణులు

నిజానికి.. మునుగోడులో ప్రస్తుతం కూసుకుంట్లకు అంత పాపులారిటీ లేదు. అందులోనూ టీఆర్ఎస్ నేతల మధ్యే అంతర్గత పోరు నడుస్తోంది. దీంతో ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని టీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నిరసనలు చేపట్టారు. అయినా కూడా సీఎం కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ శ్రేణుల గోడును కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. అందులో అధికారికంగా ఇంకా మునుగోడు అభ్యర్థి విషయాన్ని చెప్పినప్పటికీ.. అభ్యర్థిగా మాత్రం కూసుకుంట్లనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కూసుకుంట్ల కొద్ది తేడాతోనే 2018 ఎన్నికల్లో ఓడిపోయాడని కేసీఆర్ చెబుతున్నప్పటికీ.. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో కూసుకుంట్ల 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అది కొద్ది తేడా కాదు కదా. మరోవైపు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి కూడా మునుగోడు టికెట్ ను ఆశిస్తున్నాడు. దీంతో కేసీఆర్.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయి.. వేరే రూపంలో ఆయనకు పార్టీ స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అంటే మునుగోడు టికెట్ ను కేసీఆర్.. కూసుకుంట్లకే కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే.. కృష్ణారెడ్డికి మరో పదవిని ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి