Crime News : ఆరు సంవత్సరాల నుండి పిల్లలు లేరని అర్థరాత్రి భార్యని భర్త ఏం చేశాడో తెలుసా…?

 Authored By sekhar | The Telugu News | Updated on :28 December 2022,6:40 pm

Crime News : ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు అవుతున్న గాని పిల్లలు కొట్టడానికి చాలా టైం పడుతుంది. చాలామంది దంపతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అనేక మందులు వాడటంతో పాటు ఆసుపత్రులు చుట్టూ తిరుగుతూ… పిల్లలు కలగడం లేదని కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో మరికొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతూ… పైశాచిత్వకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రీతిగానే ఓ ప్రబుద్ధుడు పిల్లలు కలగలేదని భార్యపై ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. పూర్తి విషయంలోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్

లక్నో లో ఓ ప్రాంతానికి చెందిన రవీంద్ర అనే వ్యక్తి ఎప్పటినుండో నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ మహిళతో ఆరు సంవత్సరాల క్రితం పెళ్లయింది. వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితం కొన్నాళ్లపాటు సాఫీగా అనే సాగుతూ వచ్చింది. ఆరు సంవత్సరాలు గడిచాయి. కానీ ఈ దంపతులకు పిల్లలు మాత్రం కలగలేదు. దీంతో ఈ జంట తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో భర్త పిల్లలు కలగలేదని భార్యపై వేధింపులకు పాల్పడటం స్టార్ట్ చేశాడు. దీంతో భర్త వేధింపులను భరించలేని భార్య గత ఆరు నెలల కిందట పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఇటీవల భర్త భార్యకు నచ్చజెప్పి నమ్మించి మళ్లీ తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్యతో అర్థరాత్రి భోజనం చేసిన తర్వాత…

Do you know what the huband did to the wfe

Do you know what the huband did to the wfe

ఇష్టం లేకపోయినా గాని భార్యని బలవంతం చేసి లైంగికంగా కలవాలని భర్త కోరడం జరిగింది. దీంతో భార్య నిరాకరించటంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య మళ్ళీ మాటల యుద్ధం స్టార్ట్ అయ్యి గొడవకు దారి చేసింది. మీకు పిల్లలు కలగటం లేదని కారణంతో భర్త రవీంద్ర భార్య ప్రవేట్ పార్ట్స్ పై బ్లేడుతో దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో మహిళా అరుపులు వేయటంతో స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా తల్లిదండ్రులు భర్త రవీంద్ర పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి