
etela rajender joined bjp
Eatala : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇవాళ సోమవారం రెండు ముఖ్య సంఘటనలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఒకటి.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని. రెండు.. టీపీసీసీకి కొత్త అధ్యక్షుణ్ని ప్రకటిస్తారని. తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో నెల రోజులకు పైగా నానుతున్న పేరు ఈటల రాజేందర్. ఆయన ఈరోజు కమలం పార్టీ కండువా కప్పుకోవటం ఖాయమైన నేపథ్యంలో దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం అనే చర్చ మొదలైంది. ఈటల రాజేందర్ కాషాయం పార్టీ తీర్థం పుచ్చుకోవటం వల్ల ఇద్దరికీ లాభమేనని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. కాకపోతే ఈటల రాజేందర్ కి తెలంగాణ బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పనిచేయటానికి వీలుంటుందని చెబుతున్నారు.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో ఉపఎన్నిక తప్పకుండా జరుగుతుంది. ఆ ఎలక్షన్ లో ఈటల గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ వీక్ గా ఉన్నా క్యాండేట్ మంచోడైతే విజయం సాధించటానికి ఎక్కువ అవకాశం ఉంది. దుబ్బాకలో జరిగిందదే. రఘునందనరావు మంచి అభ్యర్థి కావటంతో అక్కడ టీఆర్ఎస్ క్యాండేట్ పై సానుభూతి సైతం పని చేయలేదు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందో తెలియదు గానీ దానికి ఏవిధమైన సానుభూతీ పనిచేయదు. సానుభూతి మొత్తం ఈటల రాజేందర్ కే సొంతమవుతుంది.
etela rajender joined bjp
ఈటల రాజేందర్ ని సీఎం కేసీఆర్ తన కేబినెట్ నుంచి కావాలనే, ఉద్దేశపూర్వకంగానే తొలగించారనే సంగతి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతోంది. ఈటల రాజేందర్ ని మంత్రివర్గం నుంచి తొలగించటానికి ప్రధాన కారణంగా అతను భూకబ్జాలకు పాల్పడ్డాడనే అంశాన్నే చూపుతున్నారు. కానీ దాన్ని ఎవరూ నమ్మట్లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్ని ఎకరాల భూమిని నిజంగా కబ్జా చేసిండనే అనుకుందాం. అయితే ఆ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియకుండానే జరిగి ఉంటుందా అనే డౌటు చాలా మందికి వస్తోంది. ఏమీ తెలియనట్లు సీఎం కేసీఆర్ ఇప్పుడు తీరిగ్గా ఈటలపై వేటు వేయటం సరికాదని అంటున్నారు. కాబట్టి హూజూరాబాద్ బైఎలక్షన్ లో అధికార పార్టీ ఆగడాలు నడవవని జనం తేల్చిచెబుతున్నారు.
ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో విజయం సాధించాక తెలంగాణ బీజేపీ పగ్గాలను కూడా ఆయనకే అప్పగిస్తే ఆ పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే బండి సంజయ్ కన్నా ఈటల రాజేందరే తెలంగాణ రాజకీయాల్లో సీనియర్. పైగా మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పక్కనే ఉండి వచ్చాడు. వాళ్లిద్దరి మధ్య అనుబంధం 17 ఏళ్లు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ లోని ప్లస్ లూ, మైనస్ లూ బండి సంజయ్ కన్నా ఈటలకే ఎక్కువ తెలుసు. అంతేకాదు. బండి సంజయ్ కన్నా ఈటలే ఇంకాస్త బాగా బీజేపీ వాయిస్ ని తెలంగాణ ప్రజలకు వినిపించగలడని చెబుతున్నారు. కాకపోతే రైతుబంధు వంటి స్కీమ్ ని విమర్శించిన ఈటల రాజేందరే దాని నుంచి లబ్ధి పొందారనే సంగతి ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక వెలుగులోకి రావటం కొంచెం ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
This website uses cookies.