
cm ys jagan must take care of volunteers
Ys Jagan : దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరిపాలన 90 శాతం మండల కేంద్రం వరకే చేరుతోంది. అంటే సర్కారు అధికారితో ఏదైనా పని పడితే ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాల్సిందేనన్న మాట. తీరా అక్కడికి వెళితే మనం కలవాల్సిన సారు ఆ రోజు డ్యూటీకి వస్తారో రారో తెలియదు. ఒక వేళ వచ్చినా ఫీల్డ్ కి వెళ్లిపోతే మళ్లీ ఆఫీసుకి ఎప్పుడు చేరుకుండో చెప్పలేం. ఆ విధంగా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల వద్దకు పాలన కోసం పరితపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించినా వంద శాతం ప్రజల వద్దకు పాలన చేరలేదు. ఆ లోటును వైఎస్సార్సీపీ గవర్నమెంట్ తీర్చిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటంతో ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన బాధలు తప్పాయి. అంతేకాదు. ఏపీలో దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరికింది.
గ్రామ, వార్డు వాలంటీర్, సచివాలయ సిబ్బంది ఉపాధి దొరికిన కొత్తలో చాలా సంతోషంగా విధులు నిర్వహించేవారు. కానీ వాళ్ల మీద రోజురోజుకీ పని ఒత్తిడి పెరగటంతో నలిగిపోతున్నారు. పని భారం పెరుగుతోంది తప్ప తమకు వచ్చే పైసలు (శాలరీ) పెరగకపోవటంతో వాళ్లకు ఏం చేయాలో తోచట్లేదు. ఉద్యోగ భద్రత లేదు. ప్రమోషన్ లేదు. ఇంక్రిమెంట్లు లేవు. ఇన్సెంటివ్స్ లేవు. కేవలం నెలకు రూ.15 వేలకే బండ చాకిరీ చేయాల్సి వస్తోంది. డిగ్రీలు చదివి అంత కష్టపడి పనిచేస్తున్నా జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఉండట్లేదు. అక్షరమ్ముక్క రాని వ్యక్తి కూలి పనికి పోయినా నెల రోజుల్లో ఈజీగా రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. దీంతో సంపాదన విషయంలో చదువుకున్నోడికి, చదువులేనోడికి మధ్య తేడా లేకుండా పోతోంది?. ఇదేంటని అడిగితే రిమార్క్ పడుతుందేమో, ఉన్న ఉపాధి కూడా ఊడుతుందేమో అని వాలంటీర్లు భయపడుతున్నారు. తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారు.
cm ys jagan must take care of volunteers
వాలంటీర్లకు పైఆఫీసర్ల నుంచి, ప్రజల నుంచి, పొలిటికల్ లీడర్ల నుంచి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తుంటాయి. మేం చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చిందంటూ నిత్యం ఎవరో ఒకరు నిలదీస్తుంటారు. దీంతో మానసిక ప్రశాంతత ఉండట్లేదు. మండల కేంద్రంలో ఉండే పర్మనెంట్ ప్రభుత్వాధికారులేమో లక్షల్లో శాలరీలు తీసుకుంటూ చేతిలో పనిలేక కాలక్షేపం చేస్తున్నారని, కింది స్థాయి వాలంటీర్ల మీదే అన్నీ రుద్దుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన మానస పుత్రికగా మంచి పేరు తెచ్చుకున్న ఈ వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కరుణా కటాక్షాలను ఎప్పుడు కురిపిస్తారోనని బాధితులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> Sonu Sood : వైఎస్సార్సీపీ సోనూసూద్ తో పెట్టుకుంటోందేంటి…?
ఇది కూడా చదవండి ==> వైసీపీ మంత్రికి తీవ్ర అవమానం…!
ఇది కూడా చదవండి ==> Pk Plan : వైఎస్ జగన్ , పీకేల మధ్య చెడిందా..? ఈసారి తెలంగాణలో అడుగుపెడుతోన్న పీకే..!
ఇది కూడా చదవండి ==> పార్టీ మారే ఆలోచన ఉన్న పురంధేశ్వరి..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
This website uses cookies.