Categories: ExclusiveNews

Good News : కేంద్ర ప‌థ‌కం బంప‌ర్ ఆఫ‌ర్.. నెల‌కి రూ.30,000 పొంద‌డం ఎలా అంటే..!

Good News : కేంద్ర ప్ర‌భుత్వం పేద వారి కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా సులువుగా ఆరోగ్య సేవలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కేంద్రం నుంచి గోల్డెన్ కార్డ్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది.

Good News ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేష‌న్..

దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్ లో ఈ పథకం అమలుకు సహాయంగా ఆయుష్మాన్ మిత్రలను పనిచేస్తుంటారు. ఆయుష్మాన్ భారత్ అమలులో సహాయం, లబ్దిదారుల కార్డులను సజావుగా తయారు చేయడం ఇంకా రోగులకు మద్ధతుగా నిలవడం. దీనికి జీతం నెలకు 5000 నుంచి 20000 వేల వరకు ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర అర్హత చూస్తే.. 12 ఉత్తీర్ణత పొంది.. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి పాధమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. స్థానిక భాష ఇంకా హిందీ లేదా ఇంగ్లీష్ లో పరిజ్ణానం ఉండాలి.

రానున్న ఐదేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖలో లక్ష మంది మిత్రల నియామకానికి ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 20,000 మంది ఆయుష్మాన్ మిత్రలను నియమించనున్నారు. మొదటి దశలో దాదాపు 10,000 మంది ఆయుష్మాన్ మిత్రలను నియమించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రులు లిస్టులో ఉన్నాయి. ఇతర పోస్టులలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆయుష్మాన్ మిత్రల కోసం ప్రతి జిల్లాలో ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఆయుష్మాన్ మిత్ర పోస్టులో నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పోస్టుల అవసరాన్ని బట్టి వారిని నియమిస్తారు.

Good News : కేంద్ర ప‌థ‌కం బంప‌ర్ ఆఫ‌ర్.. నెల‌కి రూ.30,000 పొంద‌డం ఎలా అంటే..!

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రచారం చేయాలి.. హాస్పిటల్ విధానాలు, ఆయుష్మాన్ కార్డులను రూపొందించడానికి ప్రజలకు సహాయం చేయాలి. క్యూ.ఆర్ కోడ్ ద్వార ఐడీని ధృవీకరించాలి. దానితో పాటుగా భీమా ఏజెన్సీలకు డేటాని పంపించాల్సి ఉంటుంది. రాత పూర్వక అసైన్ మెంట్ నిర్వహించడం.. ఇంకా ఆధార్ తో డేటా వెరిఫికేషన్ లో సాయాహం చేయడం చేయాలి.అప్లై చేసే విధానం చూస్తే.. అధికారిక వెబ్ సైట్ https://pmjay.gov.in కి వెళ్లాలి. ఆ త‌ర్వాత హోం పేజీలో రిజిస్టర్ చేసుకోవడానికి అన్న దాని దగ్గర క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఇంకా మొబైల్ నంబర్ ఇవ్వాలి. అప్లై ని క్లిక్ చేయాలి. మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అది అక్కడ ఎంటర్ చేసి కొనసాగించాలి. వివరాలు రిజిస్ట్రేషన్ లో పూర్తించాలి. అవసరమైన పత్రాలను జత చేయాలి. పూర్తైన తర్వాత సబ్ మిట్ చేసి లాగిన్ ఐడి పాస్ వర్డ్ వస్తుంది అది జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Recent Posts

Health Tips | యాలకులు .. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధం!

Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…

22 minutes ago

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

1 hour ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

2 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

11 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

12 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

13 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

15 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

16 hours ago