Munugode Bypoll : మునుగోడులో హోరాహోరి… ఆధిక్యంలో బీజేపీ..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 6 November 2022, 10:40 am

Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరహోరీగా సాగుతుంది. తొలి రౌండులో టిఆర్ఎస్ అదిక్యంలో ఉండగా రెండో రౌండ్ నుండి బీజేపీ ముందంజలో ఉంది. మునుగోడు ఐదో రౌండ్ వచ్చేసరికి కూడా బీజేపీ ముందంజలో ఉండటం విశేషం. దీంతో మొదటి రౌండు మినహా మిగతా రౌండ్ లలో బీజేపీ ముందంజలో ఉండటంతో టిఆర్ఎస్ శ్రేణులలో టెన్షన్ స్టార్ట్ అయింది.

తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇన్చార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీ అదిక్యంలో ఉండటం విశేషం. మొత్తం 15 రౌండ్ లలో ఓట్ల లెక్కింపు ఉండగా… ఐదు రౌండ్ లు కంప్లీట్ అయ్యాయి. మొదటి రౌండు టిఆర్ఎస్ ముందంజలో ఉండగా మిగతా అన్ని రౌండ్ లలో బీజేపీ ముందంజలో ఉంది.

Munugode Bypoll in BJP was leading

Munugode Bypoll in BJP was leading

రౌండ్ రౌండ్ కి మారుతున్న అదిక్యం. టెన్షన్ పుట్టిస్తుంది. ప్రతి రౌండ్ లో కొనసాగుతున్న ఉత్కంఠ బట్టి చూస్తే స్వల్ప సంఖ్యలోనే గెలిచే అవకాశాలు ఉన్నటు అర్ధం అవ్వుతోంది. మునుగోడు ఉప ఎన్నిక పోటీ తెరాస..బీజేపీ పార్టీల మధ్యే ఉంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp