Nara Lokesh | ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల ప్రోత్సాహానికి క‌స‌ర‌త్తులు.. 3% స్పోర్ట్స్ కోటా అమలు: నారా లోకేష్

Authored By Sam C | The Telugu News | Updated on : 30 August 2025, 1:00 pm

Nara Lokesh | రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.“బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్” పేరుతో విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడల ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రణాళికలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు.

#image_title

క్రీడల అభివృద్ధికి విశేష కృషి

క్రీడల ప్రోత్సాహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారని, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా గ్రామం నిర్మించిన ఘనత ఆయనదేనని అన్నారు.

రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో క్రీడా రంగాన్ని వ్యాపింపజేసేందుకు సుసూక్ష్మ ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ముఖ్యంగా బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలులోకి తీసుకురానున్నామని తెలిపారు. అయితే, ఇది సాధించాలంటే తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారాలని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 43,000 పాఠశాలలు ఉన్నా, సరిపడా పీఈటీలు (Physical Education Teachers) లేని పరిస్థితి ఉందని పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మార్పు తేవడం సవాలుగా మారిందని అంగీకరించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp