Phone Fraud : 90 ఏళ్ల మహిళ నుంచి 241 కోట్లు కొట్టేశారు.. ప్రపంచంలో ఇది అతి పెద్ద మోసం..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 April 2021,9:54 pm

Phone : ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా 241 కోట్లు… 90 ఏళ్ల మహిళ నుంచి కొట్టేశారు. వాళ్లు ఎవరో తెలుసా? సైబర్ నేరగాళ్లు. కానీ… తమ పనిని కేవలం ఒక ఫోన్ తో కానిచ్చేశారు. ఆ మహిళ నుంచి పెద్ద మొత్తంలో గుంజి… ప్రపంచంలోనే అతి పెద్ద మోసానికి తెర లేపారు. 241 కోట్లంటే మామూలు మాటలా? వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్న సైబర్ క్రిమినల్స్… తమ పనిని చాలా సులభంగా చేసేశారు. ఇంతకీ ఆ మహిళ వీళ్ల బుట్టలో ఎలా పడింది… వీళ్లు అంత ఈజీగా తనను ఎలా మోసం చేయగలిగారో తెలుసుకుందాం రండి.

ఆ వృద్ధ మహిళ వయసు సుమారు 90 ఏళ్లు. హాంగ్ కాంగ్ లో మిలియనీర్. గత సంవత్సరం వేసవి కాలంలో ఆ మహిళకు కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు. తాము చైనా పబ్లిక్ సెక్యూరిటీ అధికారులం అని తమను తాము పరిచయం చేసుకున్నారు. ఒక క్రిమినల్ కేసులో ఆ మహిళ ఇరుక్కుందని అబద్ధం చెప్పారు. తన ఐడెంటిటీని కొందరు వాడుకొని ఈ నేరం చేశారని… అందుకే తనకు కాల్ చేశామని నమ్మబలికారు. ఆ మహిళ కూడా నిజమే అనుకుంది. తన అకౌంట్ లో నుంచి కొంత డబ్బు తమకు పంపించాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు. తమ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు డబ్బు పంపిస్తే తాము అకౌంట్ వివరాలు చెక్ చేస్తామని చెప్పారు. దీంతో ఆ మహిళ నమ్మి.. కొంత డబ్బును వాళ్లు చెప్పిన అకౌంట్ లోకి పంపించింది.

old woman lost 241 crore in phone

old woman lost 241 crore in phone

కొన్ని రోజుల తర్వాత ఓ వ్యక్తి తన ఇంటికి వచ్చి.. ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఇచ్చి… సెక్యూరిటీ అధికారులతో మాట్లాడేందుకు ఈ ఫోన్ నే వాడాలంటూ చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కేటుగాళ్లు ఆ ఫోన్ ద్వారా తనను బెదరిస్తూ సుమారు 11 సార్లు తనతో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అలా ఐదు నెలల్లో తన నుంచి సుమారు 241 కోట్ల రూపాయలు లాగారు.

Phone : తన ఇంట్లో పనిచేసే వ్యక్తిని అనుమానం రావడంతో బయటపడ్డ మోసం

అయితే.. ఆ వృద్ధ మహిళ ఇంట్లో పనిచేసే వ్యక్తికి అనుమానం వచ్చింది. వృద్ధ మహిళ ఆందోళనగా ఉండటం.. రోజూ ఎవరితోనే టెన్షన్ గా ఫోన్ లో మాట్లాడటం గమనించి… వెంటేనే ఆ మహిళ కూతురుకు ఆ విషయాన్ని చెప్పింది. దీంతో ఆ మహిళ కూతురు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు… విచారణ ప్రారంభించారు. ఆ మహిళ డబ్బులు పంపించిన బ్యాంకు అకౌంట్ డిటెయిల్స్ తెలుసుకొని… ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళ బావురుమంది. అంతే కదా.. ఒకటా రెండా… 241 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి