Pears Fruit | వర్షాకాలంలో ఈ పండుకు ప్ర‌త్యేక స్థానం .. పియర్ పండు ప్రయోజనాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pears Fruit | వర్షాకాలంలో ఈ పండుకు ప్ర‌త్యేక స్థానం .. పియర్ పండు ప్రయోజనాలు

 Authored By sandeep | The Telugu News | Updated on :6 September 2025,8:00 am

Pears Fruit | వర్షాకాలం వచ్చింది అంటే ఇన్ఫెక్షన్లు, వైరల్స్, జీర్ణ సమస్యలు మామూలే. ఈ సీజ‌న్‌లో ముఖ్యంగా, పోషకాలతో నిండిన పండ్లు మనం ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం. అలాంటి వాటిలో పియర్ (Pear) పండుకు ప్రత్యేక స్థానం ఉంది.

పియర్ పండులో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, రాగి, మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పోషకాహార నిపుణుల ప్రకారం, వర్షాకాలంలో పియర్‌ను తినడం ద్వారా మీరు అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

#image_title

పియర్ పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు:

1. శరీరంలోని వాపును తగ్గిస్తుంది

పాత గాయాలు లేదా ఇతర కారణాల వల్ల శరీరంలో వాపు రావడం సాధారణం. పియర్‌లో ఉన్న ఫ్లేవనాయిడ్లు, విటమిన్ C, విటమిన్ K వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

2. జీర్ణక్రియకు మేలు చేస్తుంది

పియర్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

3. మధుమేహం నియంత్రణలో సహాయం

పియర్ పండులో ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

4. బరువు తగ్గించడంలో సహాయం

పియర్‌లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా, అధిక ఆహారానికి ఆశపడకుండా బరువు తగ్గించుకోవచ్చు.

5. గుండె ఆరోగ్యానికి మేలు

పియర్‌లో ఉండే ప్రోసైనిడిన్ అనే యాంటీఆక్సిడెంట్ గుండె సంబంధిత రిస్క్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
పియర్ తొక్కలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్థం అధిక రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది