Prabhas- Anushka | 8 సంవత్సరాల తర్వాత జంటగా కనిపించనున్న అనుష్క- ప్రభాస్.. ఫ్యాన్స్కి పండగే..!
Prabhas- Anushka | టాలీవుడ్లో హిట్ జోడీ ప్రభాస్ – అనుష్క పేర్లు ఎప్పుడు వార్తలలో నిలుస్తుంటాయి. బిల్లా, మిర్చి, బాహుబలి రెండు పార్ట్స్లో నటించిన ఈ జంట, ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ ఉందన్న వార్తలు ఏళ్లుగా చక్కర్లు కొడుతున్నా, చివరకు అవన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయింది. ఈ జంట చివరిసారి బాహుబలి 2 ప్రమోషన్స్లో కలిసి కనిపించింది. అప్పటి నుంచి దాదాపు 8 సంవత్సరాలు గడిచినా, వీరిద్దరూ ఒక్కచోట కనిపించలేదు.
#image_title
కలిసి సందడి..
ఇప్పుడు మళ్లీ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “ఘాటీ” ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. కానీ ఇప్పటివరకు ప్రమోషన్లు లేకపోవడంతో, మేకర్స్ ఓ భారీ ప్లాన్ చేశారు. సినిమాకు హైప్ తెచ్చేందుకు ప్రభాస్ – అనుష్కలతో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ హోస్ట్గా, అనుష్కను ఇంటర్వ్యూ చేయనున్నట్టు టాక్. ఈ ఇంటర్వ్యూలో ఘాటీ సినిమా విషయాలే కాదు, ఇద్దరి కెరీర్, గత అనుబంధం, వదంతులు, పెళ్లి వంటి ఆసక్తికర విషయాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది.ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను సినిమా విడుదలకు ముందు ఆన్లైన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.