
prashanth kishore political planning Enter into Telangana
Pk Plan : ప్రశాంత్ కిషోర్ (పీకే) గురించి తెలుగువారికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి తెర వెనక పనిచేసిన టీమ్ పీకేదే. లేటెస్టుగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారి నెగ్గటానికి, తమిళనాడులో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మొదటిసారి సక్సెస్ సాధించటానికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించింది కూడా పీకేనే. అంతెందుకు 2014లో కేంద్రంలో మోడీ తొలిసారి ప్రధానమంత్రి అవటంలో పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేసిందీ ప్రశాంత్ కిషోరే కావటం విశేషం. అయితే అదే పీకే ఇప్పుడు అదే మోడీని గద్దె దించటానికి జాతీయ స్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ వరసపెట్టి కలుస్తున్నాడు.
పీకే త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా భేటీ అయ్యే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లో ఉన్నాడని అంటున్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పీకే సీఎం కేసీఆర్ తో చర్చించకపోవచ్చు. సీఎం కేసీఆర్ కూడా పీకేని వాటి గురించి అడగకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ పై ప్రస్తుతం సీఎం కేసీఆర్ కి ఉన్నంత పట్టు బహుశా పీకేకి కూడా లేకపోవచ్చు. కాకపోతే గతంలో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కొంత వరకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని సైతం సీఎం కేసీఆర్ చాలా సార్లు తప్పుపట్టారు. కాబట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే పీకే.. సీఎం కేసీఆర్ ని కలుస్తారని పేర్కొంటున్నారు.
prashanth kishore political planning Enter into Telangana
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో క్లోజ్ గా ఉంటున్నాడని ఎల్లో మీడియా తనకు అలవాటైన కథలు చెబుతోంది. సీబీఐ, ఈడీ కేసుల మాఫీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమల నాథులతో సన్నిహితంగా ఉంటున్నారని దుష్ప్రచారం చేస్తోంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరకపోవచ్చని, ఈ నేపథ్యంలో పీకే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాడని అంటోంది. కానీ అది ఎంత వరకు నిజమో కాలమే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యాడని, అందుకే అతనికి బెయిల్ వచ్చిందని కూడా పచ్చ మీడియా అప్పట్లో రాసుకొచ్చింది. నరం లేని నాలుక నాలుగు విధాలుగా మాట్లాడుతుంది కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గురించి పట్టించుకోవాల్సిన పనిలేదని పొలిటికల్ పెద్దలు సూచిస్తున్నారు.
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
This website uses cookies.