PV Sindhu : పేలిన భార‌త్ తూటా.. ఒలంపిక్స్‌లో తొలి విజ‌యం సాధించి రెండో రౌండ్‌కి చేరిన పీవీ సింధు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

PV Sindhu : పేలిన భార‌త్ తూటా.. ఒలంపిక్స్‌లో తొలి విజ‌యం సాధించి రెండో రౌండ్‌కి చేరిన పీవీ సింధు

PV Sindhu : పారిస్ ఒలంపిక్స్‌లో మ‌నోళ్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు. మనుభాకర్‌ బుల్లెట్ 12 ఏళ్ల ఎదరుచూపులకు తెరదింపుతూ షూటింగ్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. దీంతో చాలా రోజుల తరువాత షూటింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం వచ్చింది. అంతేకాదు షూటింగ్‌లో ఒలింపిక్స్‌ పతకం కొట్టిన తొలి భారత మహిళగా మనుభాకర్‌ రికార్డులకెక్కింది. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా రెండో రోజు జరిగిన తొలి మేజర్ మ్యాచ్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,11:00 am

PV Sindhu : పారిస్ ఒలంపిక్స్‌లో మ‌నోళ్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు. మనుభాకర్‌ బుల్లెట్ 12 ఏళ్ల ఎదరుచూపులకు తెరదింపుతూ షూటింగ్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. దీంతో చాలా రోజుల తరువాత షూటింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం వచ్చింది. అంతేకాదు షూటింగ్‌లో ఒలింపిక్స్‌ పతకం కొట్టిన తొలి భారత మహిళగా మనుభాకర్‌ రికార్డులకెక్కింది. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా రెండో రోజు జరిగిన తొలి మేజర్ మ్యాచ్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మధ్య జరుగుతున్న మ్యాచ్ పై భారత అభిమానులు పీవీ సింధుపై వేల ఆశలు పెట్టుకున్నారు.

PV Sindhu సింధు జోరు..

పీవీ సింధు వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించింది.ఈసారి మూడో పతకం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. మహిళల సింగిల్స్ గ్రూపులో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబ్బా అబ్దుల్ రజాక్‌పై గెలిచి పివి సింధు రెండో రౌండ్‌కి అర్హ‌త సాధించింది. పీవీ సింధు, మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబ్బా అబ్దుల్ రజాక్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. పీవీ సింధు తొలి పాయింట్‌ సాధించి మ్యాచ్‌ను ప్రారంభించింది. దీని తర్వాత, మార్కుల వ్యత్యాసం క్రమంగా పెరిగింది. తర్వాత ఆమెకు 10 మార్కులు వచ్చాయి. అయితే అబ్దుల్ రజాక్‌కు 4 మార్కులు వచ్చాయి. సింధు 15-5 మరియు 21-9 భారీ తేడాతో గేమ్‌ను సులభంగా గెలుచుకుంది.

PV Sindhu పేలిన భార‌త్ తూటా ఒలంపిక్స్‌లో తొలి విజ‌యం సాధించి రెండో రౌండ్‌కి చేరిన పీవీ సింధు

PV Sindhu : పేలిన భార‌త్ తూటా.. ఒలంపిక్స్‌లో తొలి విజ‌యం సాధించి రెండో రౌండ్‌కి చేరిన పీవీ సింధు

తొలి గేమ్‌ను సులువుగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అబ్దుల్ రజాక్ పునరాగమనం చేసి 3 పాయింట్లు సాధించి స్కోరును 3-5తో నిలబెట్టింది, అయితే పివి సింధు దూకుడు ప్రదర్శించి స్కోరు లైన్‌ను 10-3 చేయడంతో మళ్లీ పెద్ద ఆధిక్యం సాధించింది. ఇక ఈ తేడా 15-6గా మారడంతో రెండో గేమ్‌లో సింధు విజయానికి చేరువైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత రెండో గేమ్‌ను 21-6 తేడాతో గెలిచి తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక సింధు బుధవారం తన తదుపరి గ్రూప్ మ్యాచ్‌లో ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కుబాతో ఆడ‌నుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది