Raghu Rama Krishna Raju With other mps are unhappy In Ysrcp
Raghu Rama Krishna Raju : ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్సీపీలో అసంతృప్తి ఒక్క నర్సాపురం ఎంపీ రఘురామరాజు Raghu Rama Krishna Raju తో పోవట్లేదు. మరో ఇద్దరు రెడ్లు కూడా అదే బాటలో నడవబోతున్నారంట. ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కోస్తా ప్రాంతానికి చెందినవారని టాక్. 2019లో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి, టికెట్ పొంది, గెలిచినవారేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవట్లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆగ్రహంగా ఉన్నారు. తమ సమస్యలను ఒకటీ, రెండు సార్లు సీఎం వైఎస్ జగన్ కి చెప్పినా ఉలుకూ లేదు, పలుకూ లేదని వాపోతున్నారు.
Raghu Rama Krishna Raju With other mps are unhappy In Ysrcp
జిల్లాల్లో తమను ఎమ్మెల్యేలు గానీ రాష్ట్ర మంత్రులు గానీ పరిగణనలోకి తీసుకోవట్లేదని ఎంపీలు బాధగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం సంక్షేమ కార్యక్రమాల గురించే నిత్యం సమీక్షలు జరుపుతున్నారు తప్ప లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టట్లేదని తప్పుపడుతున్నారు. ఒక్కోసారి ఆవేశాన్ని ఆపుకోలేక ఓపెన్ గానే విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎలక్షన్ నాటికి వేరే పార్టీలోకి జంప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. పార్టీ తరఫునా, ప్రభుత్వం తరఫునా సరైన గుర్తింపు లేకపోవటంతో కేడర్ కి ఏమీ చేయలేకపోతున్నామనే నిరాశ వాళ్లల్లో అలుముకుంది.
వైఎస్సార్సీపీలో ఎంపీ రఘురామరాజుది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. చక్కగా అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ఓపికతో పనులు చేయించుకోవాల్సిందిపోయి హైకమాండ్ నే టార్గెట్ చేయటం సరికాదు. పర్సనల్ ఇగో ఫీలింగ్స్ తో రఘురామరాజు Raghu Rama Krishna Raju పూర్తిగా దారితప్పాడు. కానీ అతని బాటలోనే నడుస్తామని వార్నింగులు ఇచ్చేవారు కాస్త వెనకా ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం బెటర్. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు గానీ మరో రెండు మూడేళ్లు గానీ తెలుగుదేశం పార్టీ పుంజుకునే సూచనలు లేవు. ఇక బీజేపీలోకి వెళితే తప్ప వాళ్లకు భవిష్యత్తు ఉండకపోవచ్చు. ఊరు మీద కోపమొచ్చి సూరు కింద కూలబడితే వాళ్ల రాజకీయ జీవితానికి అర్థమే ఉండకపోవచ్చు. అదే సమయంలో వైఎస్ జగన్ కూడా పార్టీ వ్యవహారాలకు మరింత సమయం కేటాయిస్తే బాగుంటుందనే సూచనలు సలహాలు కూడా వస్తున్నాయి.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.