Heart Stroke | యువ‌కులు సడెన్ డెత్‌కి కార‌ణం ఏంటి.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Stroke | యువ‌కులు సడెన్ డెత్‌కి కార‌ణం ఏంటి.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2025,10:00 am

Heart Stroke | ఆటలాడుతూ ఓ యువకుడు… డ్యాన్స్ చేస్తూ మరొకరు… నవ్వుతూ మాట్లాడుతున్న సమయంలో ఇంకొకరు… ఇలా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పలువురు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలు మనల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాలు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్. పోస్ట్‌మార్టం నిపుణుల పరిశీలనల ప్రకారం, ఆకస్మిక మరణాల వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఇవే

#image_title

పెరిగిన ఒత్తిడి, జీవనశైలి మార్పులు

* వ్యాయామం లేకపోవడం
* అధిక ఒత్తిడి
* తగిన నిద్ర లేకపోవడం
* అనారోగ్యకరమైన ఆహారం

ముందస్తు హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం

అలసట, ఛాతీ నొప్పి, శ్వాసలో తేడాలు వంటి సంకేతాలను పట్టించుకోకపోవడం
చిన్న లక్షణాలనూ పట్టించుకోకుండా ఉండడం

కుటుంబ చరిత్ర, కోవిడ్ ప్రభావం

గుండె జబ్బులకు జెనెటికల్ రిస్క్ ఉన్నవారు
కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో గుండె ధమనుల మీద ప్రభావం
ICMR అధ్యయనం ప్రకారం, కోవిడ్ తర్వాత ఆకస్మిక మరణాలు పెరిగినట్లు నివేదికలు

మద్యం, డ్రగ్స్ వల్ల ప్రమాదం

అధికంగా మద్యం సేవించడం
మాదకద్రవ్యాల వాడకం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం
ఇది గుండె లేదా మెదడులో ధమనులు చీలిపోవడానికి దారితీస్తుంది

కొన్నిసార్లు, గుండెలో పెద్ద ధమని పూర్తిగా మూసుకుపోతుంది. చిన్న రక్తనాళాల సహాయంతో గుండె పనిచేసినా, మొదటి లేదా రెండవ కార్డియాక్ అరెస్ట్‌లోనే మరణించే ప్రమాదం. కార్డియోమయోపతి ఉన్నవారు (గుండె కండరాలు బలహీనంగా మారడం) , వార్మప్ లేకుండా వ్యాయామం చేయడం, మెట్లు ఎక్కడం వంటి శ్రమతో ప్రాణాంతక ప్రమాదం. కొన్ని సందర్భాల్లో గుండె ధమనులు తాత్కాలికంగా మూసుకుపోయి తిరిగి తెరుచుకోవచ్చు. ఇవి పోస్ట్‌మార్టం సమయంలో కనిపించకపోవచ్చు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది