
three capitals issue in andhra pradesh telugu
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం తన ఫోకస్ ను మొత్తం వచ్చే ఎన్నికల మీదనే పెట్టారు. అంటే 2024 లో రాబోయే ఎన్నికల మీదనే. దాని కోసం ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి ఎన్నికలు ఇంకో మూడేళ్లకు వస్తాయి కానీ.. పార్టీలకు ఉన్న సమయం రెండేళ్లే అని అనుకోవాలి. చివరి సంవత్సరం మొత్తం ఎన్నికల వ్యూహాలు, హడావుడి, అభ్యర్థులు.. దీంతోనే సరిపోతుంది. అందుకే.. ఈ రెండేళ్ల సమయంలోనే.. సీఎం జగన్ చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది.. మూడు రాజధానుల అంశం. అవును.. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం కానీ.. ఇప్పటి వరకు ఇది ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు. కోర్టుల్లోనే నానుతోంది ఈ అంశం.
three capitals issue in andhra pradesh telugu
మూడు రాజధానులు ఉంటే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు. కనీసం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా తీవ్రంగా అడ్డంకులు వస్తున్నాయి. రాజధానుల విషయంపై ఇప్పటికే చట్టం అయినా కూడా రాజధాని మాత్రం తరలిపోవడం లేదు. కోర్టుల్లో విచారణ స్టేజ్ లో ఉండిపోయాయి.
ఇక.. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ.. మూడు రాజధానుల అంశం ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత బెటర్ అని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. అందకే.. కొత్తగా రాజధానిపై వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. విశాఖకు త్వరలోనే రాజధాని తరలి వెళ్తుంది.. ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఏ క్షణమైనా అక్కడ నుంచి పరిపాలన ప్రారంభం కావచ్చు.. అంటూ వైసీపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఓవైపు మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు.. ఎంపీ విజయసాయిరెడ్డి.. వీళ్లిద్దరూ ఇప్పుడూ ఇదే పాట పాడుతున్నారు. దీంతో మరోసారి మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.
three capitals issue in andhra pradesh telugu
కావాలనే.. వైసీపీ హైకమాండ్ వీళ్లతో ఈ మాటలు చెప్పిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్నికల వ్యూహమేనని చెబుతున్నారు. అలాగే.. వైజాగ్ లో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు కూడా సిద్ధమైపోయింది. సీఎం జగన్ ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే పరిపాలన రాజధాని అవుతుంది కాబట్టి.. ఆ కాన్సెప్ట్ తో సీఎం జగన్.. వైజాగ్ కు వెళ్లి అక్కడి నుంచే పాలన సాగించాలని భావిస్తున్నారట. ఇదే లాజిక్ తో విశాఖకు రాజధానిని తరలించాలని ప్లాన్. అందుకే.. త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని తరలివెళ్తుంది.. అని వైసీపీ నేతలు డప్పు కొడుతున్నారు. ఇవాళో.. రేపో.. కరోనా తగ్గగానే.. సీఎం జగన్ అన్నీ సర్దుకొని విశాఖ వెళ్లి.. అక్కడి నుంచి పరిపాలన సాగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. విశాఖకు రాజధాని ఎప్పుడు తరలి వెళ్తుందో?
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
This website uses cookies.