
three capitals issue in andhra pradesh telugu
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం తన ఫోకస్ ను మొత్తం వచ్చే ఎన్నికల మీదనే పెట్టారు. అంటే 2024 లో రాబోయే ఎన్నికల మీదనే. దాని కోసం ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి ఎన్నికలు ఇంకో మూడేళ్లకు వస్తాయి కానీ.. పార్టీలకు ఉన్న సమయం రెండేళ్లే అని అనుకోవాలి. చివరి సంవత్సరం మొత్తం ఎన్నికల వ్యూహాలు, హడావుడి, అభ్యర్థులు.. దీంతోనే సరిపోతుంది. అందుకే.. ఈ రెండేళ్ల సమయంలోనే.. సీఎం జగన్ చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది.. మూడు రాజధానుల అంశం. అవును.. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం కానీ.. ఇప్పటి వరకు ఇది ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు. కోర్టుల్లోనే నానుతోంది ఈ అంశం.
three capitals issue in andhra pradesh telugu
మూడు రాజధానులు ఉంటే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు. కనీసం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా తీవ్రంగా అడ్డంకులు వస్తున్నాయి. రాజధానుల విషయంపై ఇప్పటికే చట్టం అయినా కూడా రాజధాని మాత్రం తరలిపోవడం లేదు. కోర్టుల్లో విచారణ స్టేజ్ లో ఉండిపోయాయి.
ఇక.. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ.. మూడు రాజధానుల అంశం ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత బెటర్ అని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. అందకే.. కొత్తగా రాజధానిపై వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. విశాఖకు త్వరలోనే రాజధాని తరలి వెళ్తుంది.. ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఏ క్షణమైనా అక్కడ నుంచి పరిపాలన ప్రారంభం కావచ్చు.. అంటూ వైసీపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఓవైపు మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు.. ఎంపీ విజయసాయిరెడ్డి.. వీళ్లిద్దరూ ఇప్పుడూ ఇదే పాట పాడుతున్నారు. దీంతో మరోసారి మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.
three capitals issue in andhra pradesh telugu
కావాలనే.. వైసీపీ హైకమాండ్ వీళ్లతో ఈ మాటలు చెప్పిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్నికల వ్యూహమేనని చెబుతున్నారు. అలాగే.. వైజాగ్ లో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు కూడా సిద్ధమైపోయింది. సీఎం జగన్ ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే పరిపాలన రాజధాని అవుతుంది కాబట్టి.. ఆ కాన్సెప్ట్ తో సీఎం జగన్.. వైజాగ్ కు వెళ్లి అక్కడి నుంచే పాలన సాగించాలని భావిస్తున్నారట. ఇదే లాజిక్ తో విశాఖకు రాజధానిని తరలించాలని ప్లాన్. అందుకే.. త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని తరలివెళ్తుంది.. అని వైసీపీ నేతలు డప్పు కొడుతున్నారు. ఇవాళో.. రేపో.. కరోనా తగ్గగానే.. సీఎం జగన్ అన్నీ సర్దుకొని విశాఖ వెళ్లి.. అక్కడి నుంచి పరిపాలన సాగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. విశాఖకు రాజధాని ఎప్పుడు తరలి వెళ్తుందో?
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.