10 Retain players IPL 2025 : రిటైన్ ధర ఎక్కువ పలికిన టాప్ 10 ప్లేయర్స్ వీళ్ళే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

10 Retain players IPL 2025 : రిటైన్ ధర ఎక్కువ పలికిన టాప్ 10 ప్లేయర్స్ వీళ్ళే..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 November 2024,10:00 pm

ప్రధానాంశాలు:

  •  10 Retain players IPL 2025 : రిటైన్ ధర ఎక్కువ పలికిన టాప్ 10 ప్లేయర్స్ వీళ్ళే..!

10 Retain players IPL 2025 : ఐపీఎల్ 2025 కి ముందు ఆట‌గాళ్ల కోసం మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే అన్ని ఫ్రాంఛైజీలు త‌మ రిటైన్, విడుద‌ల చేసిన ఆట‌గాళ్ల వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించాయి. అయితే, ఏవ‌రూ ఊహించ‌ని విధంగా స్టార్ ప్లేయ‌ర్ల‌ను కూడా కొన్ని టీమ్స్ వ‌దులుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌లోనూ సీఎస్కేలో కొనసాగనున్నాడు.

10 Retain players IPL 2025 టాప్ 10 ఆటగాళ్ళు..

ఐపీఎల్-2025కు సంబంధించి ప్రకటించిన పది ఫ్రాంచైజీల రిటైన్ జాబితాలో హెన్రిచ్ క్లాసెన్‌కు భారీ ధర దక్కింది. ఈ దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్- వికెట్ కీపర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.23 కోట్లు చెల్లించింది.కోహ్లిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.21 కోట్లు ఇచ్చి తమ ఫ్రాంచైజీలో కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కోహ్లి వేలంలోకి వెళ్లని ఆటగాడిగా తన రికార్డును కొనసాగిస్తున్నాడు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ తమ వికెట్ కీపర్-హిట్టర్ నికోలస్ పూరన్‌కు కూడా రూ.21 కోట్లు రిటైన్ ధర నిర్ణయించింది. ఇక సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్, బ్యాటర్ యశస్వీ జైస్వాల్, గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు.. రూ.18 కోట్లు రిటైన్ ధర దక్కించుకున్నారు.

10 Retain players IPL 2025 రిటైన్ ధర ఎక్కువ పలికిన టాప్ 10 ప్లేయర్స్ వీళ్ళే

10 Retain players IPL 2025 : రిటైన్ ధర ఎక్కువ పలికిన టాప్ 10 ప్లేయర్స్ వీళ్ళే..!

ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్లల విషయానికి వస్తే అత్యధిక రిటైన్ ధర పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు), ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ (రూ.5 కోట్లు) పొందారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు బీసీసీఐ కనీసం రూ.4 కోట్లుగా రిటైన్ ధర నిర్ణయించింది.అన్ క్యాప్‌డ్ ప్లేయర్ జాబితాలో ఉన్న ధోనీ నాలుగు కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్‌కు కొనసాగనున్నాడు.రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్, కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కొనసాగిస్తున్నాయి. కే ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లను ఆయా జట్లు రిటైన్ చేసుకోలేదు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది