Andhra Pradesh : అసలు వినాయక చవితితో రాజకీయం చేసేది ఎవరు? ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు?

Advertisement
Published by
Advertisement

Andhra Pradesh వినాయక చవితి వేడుకలపై రాష్ట్రంలో కొనసాగుతున్న రభస నేపథ్యంలో తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. వినాయక చవితి పండుగ పై టీడీపీ, బీజేపీ నేతలు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని రివర్స్ ఎటాక్ చేశారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లోనూ అవే నిబంధనలు ఉన్నాయని కొడాలి నాని స్పష్టం చేశారు. కావాలని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాల పట్ల గౌరవం ఉందని, అందరి మతవిశ్వాసాలను ఆయన గౌరవిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు.

Advertisement

ఏపీలో అడ్రస్ లేని బీజేపీ కూడా రాజకీయ చేస్తోందంటూ, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. సోము వీర్రాజు కి విగ్రహాలతోనూ, వినాయకచవితి తోనూ రాజకీయం చేయడం అలవాటు అంటూ కొడాలి నాని విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నారా లోకేష్ ని టార్గెట్ చేసిన కొడాలి నాని తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ లు వినాయకచవితిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లోకేష్ లు శవం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కరోనాతో ప్రజలకు ఇబ్బందులు వస్తే రాజకీయాలు చేయడం కోసం ఇప్పుడు ఈ డ్రామాలాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తుంటే వినాయక చవితి విషయంలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

Advertisement

ysrcp leaders focus on ap cabinet berth

బీజేపీ, టీడీపీల రచ్చ..  Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటే, కావాలని మత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. గణేశ మండపాలు ఏర్పాటు చెయ్యొద్దని, వినాయక నవరాత్రులు ఇళ్లలో నిర్వహించుకోవాలని, ఇక పూజా సామాగ్రి కొనుగోలు వద్ద సామాజిక దూరం పాటించాలని, కరోనా ఆంక్షలు అమలు అవుతున్న నేపథ్యంలో బహిరంగ వేదికలపై ఉత్సవాలు నిర్వహించడం కూడదని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

tdp

ఇక ఈ నేపథ్యంలో మద్యం షాపులకు లేని కరోనా, స్కూళ్ళు తెరవడానికి లేని కరోనా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వర్ధంతులు, వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి లేని కరోనా వినాయక చవితి నిర్వహించుకోవడానికి అడ్డం వస్తుందా అంటూ బీజేపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని అందుకే ఏ రాష్ట్రంలోనూ పెట్టని ఆంక్షలు, ఆంధ్రప్రదేశ్ లో పెడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ, టీడీపీ నాయకులు. నిన్నటికి నిన్న బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టి జగన్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ వినాయక చవితి వేడుకలను నిర్వహించుకునేలా అనుమతించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

Advertisement

Recent Posts

Eat Eggs in Summer : సమ్మర్‌లో గుడ్లు తింటే శరీర వేడి పెరుగుతుందా? నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే!

Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…

2 minutes ago

Tea : రోజూ టీ తాగుతున్నారా? ఏజ్‌ను బట్టి ఎంత తాగాలో డాక్ట‌ర్స్ చెప్పే నిజాలు ఇవే..!

Tea  : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…

1 hour ago

Today Horoscope : 7 జూన్ 2026 రాశిఫలాలు : ఏ రాశివారికి శుభయోగం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలి ?

Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…

2 hours ago

Yamadonga : యమదొంగ కథ అసలు ఎన్టీఆర్ కోసం కాదు.. ఆసక్తికర నిజం బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్

Yamadonga  : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…

11 hours ago

Police Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,000 పోలీసు జాబ్స్‌ భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

Police Jobs  : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…

12 hours ago

Anasuya Jabardasth : నా గొంతు నొక్కేయాలని చూశారు’.. జబర్దస్త్ వదిలేయడానికి అసలు కారణం చెప్పిన అనసూయ

Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…

13 hours ago

Team India or Gujarat Titans : భారత జట్టా.. గుజరాత్ జ‌ట్టా… సెలక్షన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు..!

Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…

14 hours ago

School Holidays : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త… వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..!

School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…

15 hours ago

Thotakura Vajresh Yadav : ఉప్పల్‌ సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయండి.. తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు

Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…

16 hours ago

Bandi Ramesh : బాలాజీ నగర్‌.. కాలనీ సమస్యల పరిష్కారానికి బండి రమేష్ భరోసా..!

Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…

16 hours ago

Talari Ambrose in Peddi : పెద్ది సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన తలారి ఆంబ్రోస్ పాత్ర.. ఈ నటుడు ఎవరో తెలుసా?

Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…

17 hours ago

Redmi Turbo 5 అదిరిపోయే ఫీచర్లు వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీతో కొత్త ఫోన్‌పై పెరిగిన అంచనాలు..!

Redmi Turbo 5  : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…

18 hours ago