Andhra Pradesh : అసలు వినాయక చవితితో రాజకీయం చేసేది ఎవరు? ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు?

Advertisement
Published by
Advertisement

Andhra Pradesh వినాయక చవితి వేడుకలపై రాష్ట్రంలో కొనసాగుతున్న రభస నేపథ్యంలో తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. వినాయక చవితి పండుగ పై టీడీపీ, బీజేపీ నేతలు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని రివర్స్ ఎటాక్ చేశారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లోనూ అవే నిబంధనలు ఉన్నాయని కొడాలి నాని స్పష్టం చేశారు. కావాలని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాల పట్ల గౌరవం ఉందని, అందరి మతవిశ్వాసాలను ఆయన గౌరవిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు.

Advertisement

ఏపీలో అడ్రస్ లేని బీజేపీ కూడా రాజకీయ చేస్తోందంటూ, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. సోము వీర్రాజు కి విగ్రహాలతోనూ, వినాయకచవితి తోనూ రాజకీయం చేయడం అలవాటు అంటూ కొడాలి నాని విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నారా లోకేష్ ని టార్గెట్ చేసిన కొడాలి నాని తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ లు వినాయకచవితిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లోకేష్ లు శవం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కరోనాతో ప్రజలకు ఇబ్బందులు వస్తే రాజకీయాలు చేయడం కోసం ఇప్పుడు ఈ డ్రామాలాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తుంటే వినాయక చవితి విషయంలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

Advertisement

ysrcp leaders focus on ap cabinet berth

బీజేపీ, టీడీపీల రచ్చ..  Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటే, కావాలని మత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. గణేశ మండపాలు ఏర్పాటు చెయ్యొద్దని, వినాయక నవరాత్రులు ఇళ్లలో నిర్వహించుకోవాలని, ఇక పూజా సామాగ్రి కొనుగోలు వద్ద సామాజిక దూరం పాటించాలని, కరోనా ఆంక్షలు అమలు అవుతున్న నేపథ్యంలో బహిరంగ వేదికలపై ఉత్సవాలు నిర్వహించడం కూడదని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

tdp

ఇక ఈ నేపథ్యంలో మద్యం షాపులకు లేని కరోనా, స్కూళ్ళు తెరవడానికి లేని కరోనా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వర్ధంతులు, వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి లేని కరోనా వినాయక చవితి నిర్వహించుకోవడానికి అడ్డం వస్తుందా అంటూ బీజేపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని అందుకే ఏ రాష్ట్రంలోనూ పెట్టని ఆంక్షలు, ఆంధ్రప్రదేశ్ లో పెడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ, టీడీపీ నాయకులు. నిన్నటికి నిన్న బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టి జగన్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ వినాయక చవితి వేడుకలను నిర్వహించుకునేలా అనుమతించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

Advertisement

Recent Posts

Dhurandhar telugu : సిగ్గుందా, ఆ సినిమా నుంచి ధురంధర్ ఫుల్ కాపీ !

Dhurandhar Telugu  : టాలీవుడ్‌లో  Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…

3 hours ago

AP Politics : కూటమి చేతికి బ్రహ్మాస్త్రం.. పవన్, చంద్రబాబు రెచ్చిపోతారు

AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…

4 hours ago

Boduppal Circle : వేగవంతంగా బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల మరమ్మతులు .. డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు కృతజ్ఞతలు

Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…

5 hours ago

Tirumala Tirupati : తిరుమల వెళ్ళే వాళ్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్..!

Tirumala Tirupati Laddu  : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…

5 hours ago

CM Chandrababu : “బూతులు.. హత్యలు.. అబద్ధాలు”: వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…

6 hours ago

Allu Sneha Reddy : మరిది పెళ్లి పార్టీ లో మెరిసిపోతున్న అల్లు స్నేహ రెడ్డి.. వైర‌ల్ ఫోటోస్‌..!

Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…

6 hours ago

Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!

Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…

7 hours ago

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…

8 hours ago

Hyderabad : హైదరాబాద్‌లో పట్టు సాధించేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్

Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…

9 hours ago

YSRCP : ఉన్నపళంగా 5 గురు వైసీపీకి రాజీనామా.. జగన్ కి షాక్..?

YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మొన్నటి…

10 hours ago

Pension : పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.. ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ..!

Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…

11 hours ago