Makar Sankranti : పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు? కారణం ఏంటంటే..
Makar Sankranti : తెలుగు వారు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో మొదటి రోజుది భోగి పండుగ. ఈ రోజు భోగి మంటలు వేస్తారు. చలిని తట్టుకునేందుకు అందరూ మంటలు వేయడం వల్ల దీనికి భోగి అనే పేరొచ్చిందని చెబుతారు పెద్దలు. ఈ పండుగ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు రేగి పండ్లు పోస్తారు. వీటిని భోగి రోజున పోస్తారు కాబట్టి.. భోగి పళ్లు అంటారు. భోగి పళ్ల ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తుంటారు.
ఐదేండ్లు లోపు వారికి భోగి పండ్లు పోస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల వారిని పిలుస్తారు. పిల్లలకు దిష్టి తీస్తారు. ఇలా చేయడానికి వెనుక ఓ శ్రాస్త్రీయత ఉందంట. పిల్లలపై భోగి పళ్లు పోస్తున్న టైంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైకి చేరి బ్రహ్మ రంధ్రానికి శక్తినిస్తుంది. మేధస్సునూ పెంచుతుంది.పిల్లల తలపై నుంచి రేగు పళ్లు పోయడం వల్ల ఆ పళ్ల నుంచి వచ్చే వాయువు తలలోని మెదడు నరాలకు యాక్టివ్గా చేస్తాయి. వింటర్లో వచ్చే దగ్గు, జ్వరం, జలుబు వంటి రోగాలతో పిల్లలు ఇబ్బందులు పడుతుంటారు.

why regi fruits are poured on head of children
Makar Sankranti : : మెదడులోని నరాలు యాక్టివ్
దీని నుంచి రక్షించేందుకు రేగు పళ్లు ఉపయోగపడతాయి. పిల్లలకు వ్యాధులను ఎదుర్కొనే శక్తి రావడం కోసమే భోగిపళ్లు పోస్తారు. ఈ పళ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో ఉపయోగం. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత రోగాలను నివారించేందుకు సహాయపడుతుంది. ఈ పళ్లు ఉన్న చోటు క్రీములు రావని నమ్మతారు. ఈ పళ్ల నుంచి వచ్చే సువాసన మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ పళ్లు తినేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ పళ్లు కేవలం వింటర్ సీజన్ లో మాత్రమే లభిస్తాయి.