
ys jagan selected 4 mlc candidates
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లోని పెద్దల సభ(శాసన మండలి)ని రద్దు చేయాలని అధికార పార్టీ వైఎస్సార్సీపీ ప్రయత్నించినా అది ప్రస్తుతానికి సాధ్యం కాలేదు. దీంతో తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ చట్ట సభలో ఖాళీ అయ్యే సభ్యుల స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం జగన్ సర్కారుకు ఉంది. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికై పదవీ విరమణ చేస్తున్నవారి స్థానాలను కొత్త వాళ్లతో భర్తీ చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలని నిర్వహించాల్సిన బాధ్యత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)ది. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎలక్షన్ పెట్టేందుకు సీఈసీ సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో కనీసం గవర్నర్ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకైనా అభ్యర్థులను ఎంపిక చేసి రాజ్ భవన్ కి పంపాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.
ఎలక్షన్ పెట్టాల్సిన అవసరంలేని నలుగురు క్యాండేట్ల సెలక్షన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పూర్తి చేశారని అంటున్నారు. నాలుగు సామాజికవర్గాలకు చెందినవారికి సీఎం ఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. కాపు (ఓసీ), బీసీ, ఎస్సీ, రెడ్డి (ఓసీ) కేటగిరీల కింద నలుగురిని ఎంపిక చేయటం అయిపోయిందని, రాజముద్ర వేసి గవర్నర్ కార్యాలయానికి పంపటమే తరువాయి అని తెలుస్తోంది. ఆ నలుగురిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి కాగా ఇంకొకరు తూర్పు గోదావరి జిల్లా నాయకుడు తోట త్రిమూర్తులు (కాపు) అని సమాచారం. మూడో వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ లీడర్ మోషేన్ రాజు అని, నాలుగో నేత కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ (బీసీ) అని వినికిడి.
ys jagan selected 4 mlc candidates
ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి బంపర్ మెజారిటీ ఉండటంతో ఎమ్మెల్సీ స్థానాలన్నీ అధికార పార్టీ ఖాతాలోకే వస్తున్నాయి. ఎన్నికలు పెట్టినా, పెట్టకపోయినా సంఖ్యా బలం వల్ల అవి సెంట్ పర్సెంట్ రూలింగ్ పార్టీకే దక్కుతాయి. గవర్నర్ కోటాలో నియమించే నలుగురిని ఖరారు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పార్టీ పట్ల విధేయత, సమర్థత, సామాజిక వర్గం, తాను గతంలో ఇచ్చిన హామీలు, పార్టీ ప్రయోజనాల కోసం ఆయా నేతలు చేసిన త్యాగాలు, పార్టీ భవిష్యత్ అవసరాలు వంటి వాటిని లెక్కలోకి తీసుకొని వీళ్లను అందలం ఎక్కిస్తున్నారని పొలిటికల్ పండితులు పేర్కొంటున్నారు.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.