ys jagan serious on west godavari Mlas
Ys Jagan : పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2019 శాసన సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 13 చోట్ల నెగ్గింది. రెండు (ఏలూరు, నర్సాపురం) ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకుంది. 2014లో కూడా ఆ జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇదే స్థాయిలో ఘన విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం సెగ్మెంట్లను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమే సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా మేలు చేయలేదని చెప్పొచ్చు. వాళ్లు నిజంగా జనానికి మంచి చేసుంటే 2019లో 15 మందికి 15 మంది ఎందుకు ఓడిపోతారు?. ఆ సంగతి ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం ఈ జిల్లాలోని వైఎస్సార్సీపీ శాసన సభ్యుల్లో చాలా మంది 30 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగినవారే అయినప్పటికీ ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే అభిప్రాయం నెలకొంది.
ఈ జిల్లా నుంచి ముగ్గురు శాసన సభ్యులు మంత్రులుగా ఉన్నారు. వాళ్లు.. ఆళ్ల నాని, తానేటి వనిత, రంగనాథరాజు. మినిస్టర్లుగా వీళ్లు కొద్దో గొప్పో ప్రభావం చూపుతున్నారు. అందువల్ల ఈ ముగ్గుర్ని పక్కన పెడితే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పేరుకే ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారని పబ్లిక్ అంటున్నారు.ఈ పది మంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదని వీరిపై జగన్ సీరియస్గా ఉన్నట్లు పార్టీ లో తెగ చర్చ జరుగుతుంది. వాళ్లకు పార్టీ హైకమాండ్ వద్ద పలుకుబడి విషయంలో గానీ ప్రజలకు అవసరమైన పనులు చేయించటంలో గానీ ఫస్ట్ క్లాస్ మార్కులు పడట్లేదని చెబుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్లు గెలిచిన ఈ రెండేళ్లలో రెండు సార్లు కరోనా వ్యాప్తి వల్ల బయట చురుకుగా వ్యవహరించి ఉండకపోవచ్చు. కానీ వచ్చే మూడేళ్లైనా యాక్టివ్ గా ఉంటే తప్ప మరోసారి ప్రజల ఆశీస్సులు పొందలేరని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ys jagan serious on west godavari Mlas
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, నరసాపురం శాసన సభ్యుడు ముదునూరు ప్రసాదరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ప్రజాజీవితంలో రెండు మూడు దశాబ్దాల నుంచి ఉంటున్నారు. అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో పనులు చేయట్లేదనే టాక్ వినిపిస్తోంది. వీళ్లు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లి నిధుల విషయంలో ఒత్తిడి చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ హైకమాండ్ సైతం తమ ప్రాధాన్యతను గుర్తించట్లేదని వీళ్లు తమలో తామే మథనపడుతున్నారు. మంత్రి పదవులు కాకపోయినా ఇతరత్రా పోస్టులేవైనా ఇస్తే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. వీళ్ల అభిప్రాయాలను, ఆవేదనను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పటికి ఆలకిస్తారో చూడాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.