
ysrcp will join in modi cabinet
Ysrcp : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చారంటే ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం వారికీ పండగే పండగ. సీబీఐ కేసుల మాఫీ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు అపొజిషన్ పార్టీకి మంచి ఛాన్స్ దొరుకుతుంది. అదే సమయంలో తమకు కేంద్ర మంత్రులుగా ప్రమోషన్లు వస్తాయనే ప్రచారం రూలింగ్ పార్టీ వాళ్లకు ఆనందం పంచుతుంది. ఈ హడావుడి రెండు మూడు రోజుల పాటు నెలకొంటుంది. ఆ తర్వాత అంతా మామూలైపోతుంది. సైలెంటుగా ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న, నిన్న హస్తినలో పర్యటించి తాడేపల్లిగూడేనికి చేరుకున్నారు. దీంతో ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ఊహిస్తూ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.
వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోతోందని, ఆ పార్టీ ఎంపీలు ముగ్గురు సెంట్రల్ మినిస్టర్లు కాబోతున్నారని చెబుతున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరి పేర్లను కూడా వెల్లడిస్తున్నారు. సీనియర్ లీడర్ విజయసాయిరెడ్డి, జూనియర్ లీడర్ డాక్టర్ గురుమూర్తి అని అంటున్నారు. డాక్టర్ గురుమూర్తి లేటెస్టుగా తిరుపతి ఉపఎన్నికలో గెలిచిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుందంటే ఆశ్చర్యపోవాల్సినదేమీ లేదు. ఎందుకంటే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీలో నంబర్ 2 అనే విషయం విధితమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టకముందు నుంచి కూడా విజయసాయిరెడ్డికి, వైఎస్ కుటుంబానికి మధ్య చాలా కాలంగా పరిచయాలు, ప్రత్యేక అనుబంధాలు, ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి విజయసాయిరెడ్డికి ప్రమోషన్ అనేది పెద్దగా ఆసక్తి కలిగించే అంశం కాదు.
ysrcp will join in modi cabinet
కొత్త ఎంపీ డాక్టర్ గురుమూర్తికి గనక కేంద్ర మంత్రి పదవి వస్తే వైఎస్సార్సీపీలో అతనికి మించిన లక్కీ ఫెలో మరొకరు ఉండరని చెప్పొచ్చు. ఎందుకంటే డాక్టర్ గురుమూర్తికి పెద్దగా రాజకీయ అనుభవం లేదు. అసలు అతనికి ఎంపీ టికెట్ లభించటమే విశేషం. అలాంటిది ఇప్పుడు ఏకంగా సెంట్రల్ మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఫిజియోథెరపిస్టుగా డాక్టర్ గురుమూర్తి వైద్యసేవలందించారట. వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించటంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావటంలో ఆ పాదయాత్ర పాత్ర గొప్పది. కాబట్టి ఆ ఫీలింగ్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గురుమూర్తికి ఎంపీ ఛాన్స్ ఇచ్చారని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొంటుంటాయి. ఇదిలా ఉండగా మోడీ మంత్రివర్గంలో ఈ రెండు పదవులతోపాటు మరో సహాయ మంత్రి పోస్ట్ (ఇండిపెండెంట్ ఛార్జ్) కూడా ఇస్తారని, దాన్ని ఉత్తరాంధ్ర లేదా తూర్పు గోదావరి జిల్లాలోని ఎంపీని వరించబోతోందని వినికిడి. నిజమేంటో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆ పైవాడికే తెలియాలి.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
This website uses cookies.