bjp targets to win 350 seats in parliament elections
Modi Target : వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఎక్కువ అవకాశాలు బీజేపీకే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మనం మాట్లాడుకునేది తెలుగు రాష్ట్రాల ఎన్నికల గురించి కాదు. పార్లమెంట్ ఎన్నికల గురించి. తెలంగాణలో, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అసలు కేంద్రంలో ఏం జరుగుతోంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చి తెగ హడావుడి చేసిన బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందా? అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లు 303. అంటే అవి ఎన్డీఏ సీట్లు. అంటే అవి రికార్డు స్థాయి స్థానాలు అనే చెప్పుకోవాలి. ఇక.. 2024 ఎన్నికల్లో బీజేపీ 300 కాదు.. 350 ప్లస్ సీట్లు సాధించాలనే టార్గెట్ ను పెట్టుకుంది బీజేపీ. 350 సీట్లు గెలిస్తే ఇక మామూలుగా ఉండదు. బీజేపీకి ఇక తిరుగే ఉండదు. దాని కోసమే బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ చతికిలపడిందో అక్కడ ఇప్పుడు బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ అంతగా రాణించలేకపోయింది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టింది. 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో అయితే బీజేపీ ఓడిపోయిందో వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆ జాబితాలో 150 నియోజకవర్గాలు ఉన్నాయి.
bjp targets to win 350 seats in parliament elections
దానిలో భాగంగానే మిషన్ సౌత్ ఇండియాను బీజేపీ స్టార్ట్ చేసింది. మిషన్ సౌత్ ఇండియాలో ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, అండమాన్, నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. ఇటీవలే సౌత్ రీజియన్ రాష్ట్రాల సమావేశం హైదరాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో ఉన్న 129 ఎంపీ సీట్లలో చాలావరకు బీజేపీ గెలువగలిగితే టోటల్ గా 350 సీట్లను గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి మరి.. బీజేపీ తన టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో?
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.