Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!
ప్రధానాంశాలు:
Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!
అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్ ''రప్పా.. రప్పానే "
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో ఈ నినాదం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే, ఇప్పుడు అదే నినాదంతో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు తెలంగాణలో పోస్టర్లు, ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ నినాదం మొదట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వినిపించగా, ఇప్పుడు అది ప్రత్యర్థులపై సవాలుగా మారుతోంది.

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!
Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!
నిన్న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రైతు భరోసా కార్యక్రమంలో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో ఈ నినాదం మరింత స్పష్టంగా కనిపించింది. హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు ఈ ధర్నాకు నాయకత్వం వహించగా, బీఆర్ఎస్ మద్దతుదారులు ప్లెక్సీ ప్రదర్శన చేశారు. ‘‘2028లో రప్ప రప్ప… 3.0 రీలోడింగ్’’ అంటూ వున్న ఈ ప్లకార్డులు తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. దీని ద్వారా బీఆర్ఎస్, 2028లో మళ్లీ అధికారంలోకి వస్తుందని సంకేతాలివ్వడం గమనార్హం.
నేడు సూర్యాపేట లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో కూడిన ప్లెక్సీ లలో కూడా ‘2028లో రప్ప రప్ప… 3.0 రీలోడింగ్’ అంటూ ఏర్పాటు చేసారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్లో ఈ నినాదం వివాదాస్పదమవుతుండగా, ఇప్పుడు అదే తెలంగాణకు విస్తరించటం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. బీఆర్ఎస్ ఈ నినాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని, తమ పార్టీ మళ్లీ గెలవబోతుందన్న నమ్మకాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ‘3.0 రీలోడింగ్’ పోస్టర్లతో బీఆర్ఎస్ తన మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం ఈ ‘రప్ప రప్ప’ గోల ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.