Mother : 90 ఏళ్ల తల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ తల్లి చేసిన పనికి అమ్మా అని పరుగులు..!
ప్రధానాంశాలు:
Mother : 90 ఏళ్ల తల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ తల్లి చేసిన పనికి అమ్మా అని పరుగులు..!
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రులే వారివల్ల చివరికి అనాథులైపోతున్న వాస్తవాన్ని తేటతెల్లం చేస్తుంది ఈ ఘటన. హైదరాబాద్ మలక్పేట్ మూసారాంబాగ్కు చెందిన శకుంతలాబాయి (90) కిఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు.. భర్తతో చాలాకాలం క్రితమే వేరుపడిన శకుంతలాబాయి, కొడుకుల వెంట ఉండుతూ జీవితాన్ని నెట్టుకొచ్చారు.

Mother : 90 ఏళ్ల తల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ తల్లి చేసిన పనికి అమ్మా అని పరుగులు..!
Mother : ఎంత దారుణం..
ఆరోగ్యంగా ఉన్నంత కాలం తన పిల్లల కోసం అన్నిరకాలుగా సేవలందించిన ఆమెకు.. చివరికి ఊహించని దురదృష్టం ఎదురైంది. వయసు కారణంగా వారికి సహాయంగా ఉండలేని స్థితికి చేరుకున్న శకుంతలాబాయిని ఆమె ఇద్దరు కొడుకులు ఇంటి నుంచి బయటకు గెంటేశారు. తల్లిని భారంగా భావించిన వారిని ఇంటి ఆస్తి మాత్రం కావాలనిపించింది. ఇల్లు తమ పేర మీద రాయమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. చివరికి శకుంతలాబాయిని ఇంటి నుంచి వదిలించుకుని, తాళం వేసి వెళ్లిపోయారు.ఇలాంటి దుర్మార్గం ఎదుర్కొన్న శకుంతలాబాయి, తన చిన్న కుమార్తె వద్ద తలదాచుకున్నారు.
తనకు న్యాయం చేయాలంటూ 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు కు ఫిర్యాదు చేశారు. అధికారుల కౌన్సెలింగ్ తర్వాత కొడుకులు తల్లికి ఇల్లు ఇస్తామని అంగీకరించినా, నెలలు గడిచినా మాట నిలబెట్టుకోలేదు. దీంతో శకుంతలాబాయి మళ్లీఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించగా, సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ స్వయంగా రంగంలోకి దిగారు. మూడు రోజుల క్రితం తుది నోటీసు జారీ చేసిన తహసీల్దార్, స్పందన రాకపోవడంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇంటికి చేరుకుని తాళం వేసిన ఇంటిని సీజ్ చేశారు.