House Construction : ఇల్లు క‌ట్టుకునేందుకు రూ.4 ల‌క్ష‌ల ఆర్థిక సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

House Construction : ఇల్లు క‌ట్టుకునేందుకు రూ.4 ల‌క్ష‌ల ఆర్థిక సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

House Construction : పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్​తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని సర్కారు నిర్ణయించింది.గృహ నిర్మాణ శాఖపై ఏపీ ​ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్ప‌టికే సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఎన్నికల హామీని నెరవేరుస్తూ గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదవారి సొంతింటి కల […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  House Construction : ఇల్లు క‌ట్టుకునేందుకు రూ.4 ల‌క్ష‌ల ఆర్థిక సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

House Construction : పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్​తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని సర్కారు నిర్ణయించింది.గృహ నిర్మాణ శాఖపై ఏపీ ​ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్ప‌టికే సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఎన్నికల హామీని నెరవేరుస్తూ గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదవారి సొంతింటి కల సాకారం చేసేలా ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించ‌నున్న‌ది.

రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని పీఎమ్​ఏవై( ప్రధానమంత్రి ఆవాస్​ యోజన) అర్బన్-2.0 కేంద్ర ప్రభుత్వ స్కీమ్​తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, ఏపీ ప్రభుత్వం వాటా 40 శాతం ఉండనుంది.

House Construction ఇల్లు క‌ట్టుకునేందుకు రూ4 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

House Construction : ఇల్లు క‌ట్టుకునేందుకు రూ.4 ల‌క్ష‌ల ఆర్థిక సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఇటీవల మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఈ విష‌యంలో ఒక కీలక ప్రకటన చేశారు. పేద ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి, భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ పాలసీ ద్వారా భవన నిర్మాణంలో ఉన్న కూలీలకు, కార్మికులకు సరైన సహాయం అందించడంతో పాటు, పేదవారి ఇంటి నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుందని మంత్రి వెల్ల‌డించారు. పేదలకు ఇల్లు నిర్మించ‌డం ద్వారా వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ప్ర‌భుత్వం చేసే ఈ ప్రయత్నం వారి జీవితాల్లో వెలుగులు తీసుకు వ‌స్తుంద‌ని అంతా భావిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది