Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనదారుడి భద్రత దృష్ట్యా ఇకపై తయారు చేసే అన్ని బైక్ లు, స్కూటీల్లో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ను తప్పనిసరి చేసింది. ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉన్నా ABS ను తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Bike బైక్ లు స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇక నుండి అవి ఫ్రీ..

అంతేకాక ప్రతి బైక్ లేదా స్కూటీ కొనుగోలుపై తయారీ సంస్థలు లేదా డీలర్లు రెండు హెల్మెట్ లు ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇకపై కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినప్పుడు, దానితో పాటే రెండు హెల్మెట్లను కూడా తప్పనిసరిగా అందించేలా డీలర్లపై నిబంధన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, వాహనదారులకు కొనుగోలు సమయంలోనే నాణ్యమైన హెల్మెట్లు అందుబాటులోకి వస్తాయి, తద్వారా భద్రత మరింత మెరుగుపడుతుంది.

మరోవైపు ఇటీవల వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారుల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకురానున్నట్లు తెలిపింది. కేవలం రూ.3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా రాకపోకలు సాగించ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది